×
Ad

Prashant Kishor : 2024లో బీజేపీని ఓడించడం సాధ్యమే – పీకే

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల గురించి హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడం సాధ్యమే అని పీకే అన్నారు.

  • Published On : January 24, 2022 / 10:48 PM IST

Prashant Kishor

Prashant Kishor : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల గురించి హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడం సాధ్యమే అని పీకే అన్నారు. అయితే, అది కాంగ్రెస్ వల్ల సాధ్యం కాదన్నారు. బీజేపీని ఓడించడానికి కొత్త కూటమి అవసరం అన్నారు పీకే. ఆ దిశగా తాను సహకారం అందిస్తానని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.

COVID : కరోనాపై సైంటిస్టుల తీపి కబురు

త్వరలో జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలపైనా పీకే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్ గా అభివర్ణించడాన్ని పీకే తోసిపుచ్చారు. ఈ రిజల్ట్స్ ఎలా ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడం సాధ్యమే అని తేల్చి చెప్పారాయన. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే ఈ వ్యాఖ్యలు చేశారు.