Rahul Gandhi: ఇక్కడ సర్టిఫికెట్లకు విలువ లేదు.. యువతే భారత్ అసలైన సంపద.. ‘విద్యార్థుల గళం’ సభలో రాహుల్
ఉత్తర్ప్రదేశ్ ‘విద్యార్థుల గళం’ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కీలక వ్యాఖ్యలు చేశారు.
- V Santhosh Kumar
- Published on- August 8, 2026 / 10:50 PM IST
Rahul Gandhi sensational comments at the 'Prayagraj Students Voice' meeting.
- యువతే భారత్ అసలైన సంపద
- సర్టిఫికెట్లకు విలువ లేదన్న రాహుల్
- ప్రేమతోనే వ్యవస్థలో మార్పు
Rahul Gandhi: ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిర్వహించిన ‘విద్యార్థుల గళం’ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పాల్గొని యువత, నిరుద్యోగ సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఉన్న సుమారు 40 కోట్ల మంది యువతే ఈ దేశానికి అసలైన సంపద అని, వారి సామర్థ్యం అమెరికా, చైనా, రష్యా వంటి పెద్ద దేశాల కంటే చాలా గొప్పదని కొనియాడారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో విద్యా సర్టిఫికెట్లకు ఏమాత్రం విలువ లేకుండా పోయిందని, కేవలం డిగ్రీలు ఉండటం వల్ల ఉద్యోగాలు రావడం లేదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Chintada Ravi Kumar: వైఎస్సార్సీపీ నేత చింతాడ రవికుమార్ అరెస్ట్.. కూటమి సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు
ఉపాధి అవకాశాల క్షీణత:
దేశంలో ఉపాధికి సంబంధించిన అన్ని మార్గాలు ప్రస్తుతం మూసుకుపోతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. తయారీ రంగం పడిపోవడం, బ్యాంకుల రుణాలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురుకావడం, వరుస పరీక్ష పత్రాల లీకేజీలు, ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా భర్తీ చేయడం వంటి పరిణామాలు యువత భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రేమతోనే వ్యవస్థలో మార్పు సాధ్యం:
ఇటీవల దేశవ్యాప్తంగా విద్యార్థులు చేసిన నిరసనలపై స్పందిస్తూ, యువత తమ భయాలను పక్కనపెట్టి చీకటిలో వెలుగులు నింపారని అభినందించారు. అయితే దేశంలో మార్పు తీసుకురావడానికి హింస, ద్వేషం ఏమాత్రం పరిష్కారం కావని స్పష్టం చేశారు. కేవలం ప్రేమ, ఆప్యాయతలతోనే వ్యవస్థలో సానుకూల మార్పు తీసుకురావడం సాధ్యమవుతుందని రాహుల్ గాంధీ యువతకు పిలుపునిచ్చారు.
