×
Ad

Money Laundering Case : పేపర్ లీక్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ చీఫ్ కుమారులకు ఈడీ సమన్లు

రాజస్థాన్ రాష్ట్రంలో పేపర్ లీక్ మనీలాండరింగ్ కేసులో రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ కుమారులకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది....

  • Published On : November 2, 2023 / 01:45 PM IST

Congress chief Govind Singh Dotasra

Money Laundering Case : రాజస్థాన్ రాష్ట్రంలో పేపర్ లీక్ మనీలాండరింగ్ కేసులో రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ కుమారులకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల టీచర్ల రిక్రూట్‌మెంట్ పరీక్ష పేపర్ల లీక్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా కుమారులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం సమన్లు జారీ చేసింది.

Also Read : Pakistan : పాకిస్థాన్‌లో ఎదురుకాల్పులు…ఆరుగురు ఉగ్రవాదులు హతం

మనీలాండరింగ్ కేసు పలువురు వ్యక్తులపై రాజస్థాన్ పోలీసులు దాఖలు చేసిన ప్రథమ సమాచార నివేదికల నుంచి బయటకు వచ్చింది.ఈ నెలాఖరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఈడీ చర్య వివాదానికి దారితీసే అవకాశం ఉంది. అదే కేంద్ర దర్యాప్తు సంస్థ అక్టోబర్ 30న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్‌ విదేశీ మారకద్రవ్య నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై తొమ్మిది గంటలపాటు సోదాలు జరిపింది.

Also Read : Hamas New Submarine Drone : హమాస్ అమ్ముల పొదిలో కొత్త సబ్ మెరైన్ డ్రోన్ ఆయుధం ‘టార్పెడో’

ఒక వైపు రాజస్థాన్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కాంగ్రెస్ నేతలపై కేసుల పేరిట దర్యాప్తును ముమ్మరం చేసింది. ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకోవడానికి మోదీ ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాల నేతలు ఆరోపించారు.