Lalu Prasad Yadav : ఆస్పత్రిలో చేరిన లాలూ ప్రసాద్​ యాదవ్.. ఏమైందంటే?

బీహార్‌ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్‌ యాదవ్‌ ఆసుప్రతిలో చేరారు.

Lalu Prasad Yadav : బీహార్‌ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్‌ యాదవ్‌ ఆసుప్రతిలో చేరారు. పాట్నాలోని తన నివాసంలో ఆయన మెట్లపై నుంచి జారిపడ్డారు. లాలూ భుజం ఎముక విరగడంతో పాటు వెన్నెముకకు గాయాలయ్యాయి. ఆయన్ను సోమవారం తెల్లవారుజామున పాట్నాలోని పరాస్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

దాణా కుంభకోణంలో దోషిగా తేలడంతో 2017 డిసెంబర్‌లో లాలుకు జైలు శిక్ష ఖరారైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో బెయిలుపై విడుదలైన తర్వాత లాలూ ఢిల్లీలో ఉన్నారు. 74 ఏళ్ల లాలు ప్రసాద్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. లాలూ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు. అనారోగ్య సమస్యల కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరి కోలుకున్నారు.

Rjd Chief Lalu Prasad Yadav Hospitalised In Patna After Fall From Stairs

దాణా కుంభకోణానికి సంబంధించి రూ.139.35 కోట్ల డోరాండా ట్రెజరీ కేసులో లాలూ ప్రసాద్‌కు ఈ ఏడాది ఏప్రిల్ 22న జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఐదో దాణా కుంభకోణం కేసుకు సంబంధించి డోరండా ట్రెజరీ నుంచి మోసపూరిత ఉపసంహరణకు సంబంధించి ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ను దోషిగా ఫిబ్రవరిలో రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చింది.

Read Also : Lalu Prasad Yadav : లాలూ ప్రసాద్ యాద‌వ్ కు మళ్లీ అస్వస్థత..ఢిల్లీ ఎయిమ్స్ లో అత్యవసర చికిత్స

ట్రెండింగ్ వార్తలు