Road Accident: మధ్యప్రదేశ్ లోని చింద్వారా – నాగపూర్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి ఫల్టీలు కొడుతూ పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే.. ఈ వీడియోను చూస్తే అచ్చం సినిమాల్లో యాక్సిడెంట్ సీన్ను తలపిస్తోంది. ఇంత భారీ ప్రమాదంలో ఓ శుభవార్త కూడా ఉంది. అదేంటంటే.. కారులో ఉన్న వారికి ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.
#TwinTowers: ట్విన్ టవర్లు కూల్చేందుకు బటన్ నొక్కుతూ కన్నీళ్లు పెట్టిన అధికారి
చింద్వారా – నాగ్పూర్ హైవేపై లింగ సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అకస్మాత్తుగా అదుపు తప్పి బోల్తా కొట్టింది. కారు అతివేగంగా రావడంతో పాటు భారీవర్షం కారణంగా రహదారిపై వర్షపు నీరు నిలిచి ఉండటంతో కారు అదుపు తప్పినట్లు తెలుస్తోంది. కారు ప్రమాదం జరిగిన ప్రదేశంలో మూల ములుపు ఉంది. అప్పటివరకు వేగంగా కారును తీసుకొచ్చిన డ్రైవర్.. అక్కడికి రాగానే స్పీడ్ తగ్గించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కారు అదుపు తప్పి రోడ్డుపక్కకు పల్టీలు కొట్టుకుంటూ పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది.
छिन्दवाड़ा में लिंगा के समीप अत्याधिक बारिश के चलते वाहन के बेकाबू होकर दुर्घटनाग्रस्त होने का समाचार प्राप्त हुआ । वाहन में सभी के सुरक्षित होने का सुखद समाचार है । बारिश में वाहन धीरे चलाए एवं अत्याधिक बारिश होने पर वाहन सुरक्षित स्थान पर खड़ा कर बारिश थमने का इंतेजार करे। pic.twitter.com/M9qfOkAFQj
— Nakul Kamal Nath (@NakulKNath) August 28, 2022
కారు పొలాల్లోకి పల్టీకొట్టుకుంటూ వెళ్తున్న సమయంలో పొలంలో ఓ చెట్టుకు ఆవును కట్టేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. కారు పల్టీలు కొట్టుకుంటూ వస్తున్న విషయాన్ని గమనించిన ఆవు పక్కకు తప్పుకొని ప్రాణాలు కాపాడుకుంది. అదృష్టవశాత్తూ కారులో ఉన్న ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. అయితే.. క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. ఈ రోడ్డు ప్రమాదం వీడియోను ఎంపీ నకుల్ నాథ్ తన ట్వీట్ ఖాతాలో పోస్టు చేశారు. వర్షాకాలంలో తక్కువ వేగంతో వాహనాన్ని నడపాలంటూ వాహనదారులను ఎంపీ కోరారు.