Supreme Court: మతం పేరుతో పిల్లలను ఇలా చూస్తారా? ముజఫర్‭నగర్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ యూపీ ప్రభుత్వాన్ని నివేదిక కోరిన సుప్రీం

ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదులోనూ జాప్యం జరుగుతోంది. కులం, మతం, లింగ వివక్షకు గురికాకూడదని ఆర్టీఈ చట్టంలోని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయని న్యాయమూర్తులు తెలిపారు

Muzaffarnagar student slapping case: యూపీలోని ముజఫర్‌నగర్‌లోని ఓ పాఠశాలలో ఒక విద్యార్థిని ఇతర పిల్లలు చెంపదెబ్బ కొట్టిన ఘటనను సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకుంది. మతం పేరుతో ఓ చిన్నారికి ఇలా జరగడం చాలా సరికాదని జస్టిస్ అభయ్ ఎస్ ఓక్, పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం వ్యాఖ్యానించింది. ఆగస్టు 24న ఖుబ్బాపూర్‌ గ్రామంలోని నేహా పబ్లిక్‌ స్కూల్‌లో త్రిప్తా త్యాగి అనే టీచర్.. ఓ చిన్నారిని ఇతర పిల్లలతో చెంపదెబ్బ కొట్టించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.

కేసు దర్యాప్తును పర్యవేక్షించేందుకు వారం రోజుల్లోగా ఐపీఎస్‌ అధికారిని నియమించాలని యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. మరి ఈ కేసులో ఏయే సెక్షన్లు విధించాలో ఆ ఐపీఎస్ అధికారి చూడాలి. విచారణపై సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వాలి. అంతేకాకుండా సాక్షులకు కూడా భద్రత కల్పించాలి. చెంపదెబ్బ తిన్న చిన్నారిని మరో పాఠశాలలో చదివించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని కోర్టు పేర్కొంది. ఆ సంఘటన పిల్లలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో దృష్టిలో ఉంచుకుని, కొట్టిన పిల్లలకు మానసిక కౌన్సెలింగ్ ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది.

Modi Calls Urban Naxals: అర్బన్ నక్సలైట్ల అంశాన్ని మరోసారి లేవనెత్తి కాంగ్రెస్‭పై విమర్శలు గుప్పించిన మోదీ

ముందు రాష్ట్రంలో విద్యావ్యవస్థ దుస్థితి ఏంటో చూడాలని, విద్యాహక్కు చట్టం ప్రకారం పిల్లలందరికీ ఉచిత విద్యను అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కోర్టు పేర్కొంది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదులోనూ జాప్యం జరుగుతోంది. కులం, మతం, లింగ వివక్షకు గురికాకూడదని ఆర్టీఈ చట్టంలోని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయని న్యాయమూర్తులు తెలిపారు. ఏ పిల్లలపైనా శారీరక హింస ఉండకూడదని హెచ్చరించింది. ఈ కేసులో రెండు అంశాలు ఉల్లంఘించబడ్డాయి. ఈ ఘటనపై విచారణ జరిపి చిన్నారి పునరావాసంపై నివేదిక ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని కోర్టు కోరింది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 30న జరగనుంది.