Noida Twin Towers: ట్విన్ టవర్స్ స్థలంలో ఏం చేద్దాం ..? కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్కు సూపర్ టెక్ సంస్థ అడుగులు.. కోర్టుకెళ్లే యోచనలో ..
నోయిడాలోని 100 మీటర్ల ఎత్తైన జంట టవర్లను నేలమట్టం చేసి వారం అవుతోంది. స్థలంలో గుట్టలుగా పడిఉన్న బిల్డింగ్స్ వ్యర్థాలను అక్కడి మున్సిపల్ సిబ్బంది పక్కకు తొలగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్విన్ టవర్స్ స్థలంపై మరోసారి వివాదం తలెత్తుతోంది.
- Harishth Thanniru
- Published On : September 4, 2022 / 07:43 AM IST
twin tower
Noida Twin Towers: నోయిడాలోని 100 మీటర్ల ఎత్తైన జంట టవర్లను నేలమట్టం చేసి వారం అవుతోంది. స్థలంలో గుట్టలుగా పడిఉన్న బిల్డింగ్స్ వ్యర్థాలను అక్కడి మున్సిపల్ సిబ్బంది పక్కకు తొలగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్విన్ టవర్స్ స్థలంపై మరోసారి వివాదం తలెత్తుతోంది. కోర్టుకుసైతం వెళ్లేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. ట్విన్ టవర్స్ కూల్చివేతల ప్రదేశంలో కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేయాలనే ఆలోచనలో సూపర్ టెక్ సంస్థ ఉంది. అయితే ఎమరాల్డ్ కోర్ట్ రెసిడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉదయ్ భన్ సింగ్ టాయోటిక్ మాత్రం అందుకు మేము ఒప్పుకోమని తేల్చిచెప్పాడు. అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని ఆయన అన్నారు.
ఈ స్థలంలో ఆలయంతో సహా అనేక ప్రతిపాదనలు వచ్చినందున సమస్యను చర్చించడానికి త్వరలో నివాసితుల సమావేశం నిర్వహించబడుతుందని ఉదయ్ భన్ సింగ్ అన్నారు. మా సొసైటీ ఆవరణలోని పచ్చటి ప్రదేశంలో ఉన్న ప్రాంతంలో అక్రమంగా జంట గోపురాలు నిర్మించబడ్డాయి. ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మేము అక్కడ ఒక పార్కును ఏర్పాటు చేయబోతున్నాం. అక్కడ ఆలయాన్ని నిర్మించడానికి అనేక మంది నివాసితుల నుండి కొన్ని సూచనలు కూడా ఉన్నాయి. దాని కోసం మేము కొన్ని రోజుల్లో నివాసితులందరితో సమావేశాన్ని నిర్వహించబోతున్నాం, తదనుగుణంగా నిర్ణయం తీసుకోబడుతుందని టియోటియా చెప్పారు.
Noida Twin Towers: ట్విన్ టవర్స్ కూల్చివేసిన ప్రాంతంలో శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టిన అధికారులు
ఇదిలాఉంటే సూపర్టెక్ సంస్థ ఛైర్మన్ ఆర్కె అరోరా మాట్లాడుతూ.. ఈ స్థలంలో గృహనిర్మాణ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని, అవసరమైతే నివాసితుల సంఘం అనుమతి తీసుకుంటామని చెప్పారు. గ్రీన్ ఏరియా కిందకురాని రెండెకరాల భూమి తమకు ఉందని కంపెనీ తెలిపింది.
