Narendra Modi: స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ, షా, నడ్డా

తన ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ అంకిత్ బైయన్‌పురియాతో కలిసి ఇందులో పాల్గొన్నట్లు మోదీ తెలిపారు.

Narendra Modi

Swachh Swasth: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో రోడ్లను శుభ్రం చేశారు. రేపు దేశం గాంధీ జయంతిని జరుపుకోనున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

తన ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ అంకిత్ బైయన్‌పురియాతో కలిసి ఇందులో పాల్గొన్నట్లు మోదీ తెలిపారు. యావత్ దేశం స్వచ్ఛతపై దృష్టి సారిస్తోందని, అంకిత్ బైయన్‌పురియా, తాను కూడా అదే పని చేశామని అన్నారు. కాగా, మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్వచ్ఛభారత్ లో పాల్గొన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్‌లో, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీలో రోడ్లపై చెత్తను శుభ్రం చేశారు. మరోవైపు, తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో మోదీ ఇవాళ మధ్యాహ్నం మహబూబ్ నగర్ చేరుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. బీజేపీ భారీ బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల శంఖారావాన్ని పూరించారు.

Srikanth Reddy : జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజలకు వైద్య సేవలు.. మండల కేంద్రాల్లో ప్రత్యేక వైద్య సిబ్బంది ఏర్పాటు : గడికోట శ్రీకాంత్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు