ఆకాశాన్ని తాకుతున్న ఉల్లి ధరలకు ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోతోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల కిలో ఉల్లి రూ.200 దాటేసింది. మహారాష్ట్రలోని సోలాపూర్,కర్ణాటకలోని బెంగళూరు,తమిళనాడులోని తదితర ప్రాంతాల్లో ఇప్పటికే కిలో ఉల్లి 200రూపాయలకు చేరిపోయింది. మరోవైపు ఉల్లి ఖరీదైన వస్తువుగా మారిపోవడంతో పలు చోట్ల ఉల్లి దొంగతనాలు జరగుతున్న విషయం తెలిసిందే.
తమిళనాడుతోని మధురైలో ఉల్లిధర కిలోకు రూ. 200కు చేరుకుంది. ఈ సందర్భంగా మధురైకి చెందిన వ్యాపారి మూర్తి మాట్లాడుతూ గతంలో వినియోగదారులు ఐదు కిలోల ఉల్లిని తీసుకువెళ్లేవారని, ఇప్పుడు ఒక కిలో లేదా అర కిలో ఉల్లిని మాత్రమే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. జయశుభ అనే గృహిణి మాట్లాడుతూ ప్రస్తుతం వారానికి సరిపడా ఉల్లిని కొనుగోలు చేసేందుకు రూ. 350 నుంచి 400 వరకూ ఖర్చుచేయాల్సివస్తున్నదని అన్నారు. మరోవైపు ఉల్లి కోరతను తీర్చేందుకు ఈజిప్ట్,టర్కీ దేశాలనుంచి దిగుమతికి భారత్ ఆర్డర్ ఇవ్వగా మరికొన్ని రోజుల్లో అవి భారత్ కు రానున్నాయి