Goods Train : పట్టాలు తప్పిన రైలు.. ఎనిమిది వ్యాగ‌న్‌లు బోల్తా.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

ఉత్తరప్రదేశ్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అలహాబాద్ నుంచి ఢిల్లీలోని పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ యూనివర్సిటీ జంక్షన్‌ను వెళ్తుండగా చందౌలీ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.

Goods Train : ఉత్తరప్రదేశ్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అలహాబాద్ నుంచి ఢిల్లీలోని పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ యూనివర్సిటీ జంక్షన్‌ను వెళ్తుండగా చందౌలీ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో మొత్తం 8 బోగీలు కిందపడ్డాయి. గూడ్స్ రైలు ప్రమాదానికి గురికావడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటన స్థలికి చేరుకొని పునరుద్ధరణ చేపట్టారు.

చదవండి : Train Coach: రైలు కోచ్‌లో టీనేజర్ ఆత్మహత్యకు కారణం గ్యాంగ్ రేప్!!

లైన్ క్లియర్ చేయడానికి మరింత సమయం పెట్టె అవకాశం ఉండటంతో రైళ్లను దారి మళ్లించారు అధికారులు. కాగా ఈ ప్రమాదం బుధవారం ఉదయం 6.40ని సమయంలో జరిగినట్లు అధికారులు తెలిపారు.

చదవండి : Trains Restoration : ప్యాసింజర్ రైళ్లు పునరుధ్ధరణ

లోకో ఫైలెట్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి సంబందించిన వివరాలను ఈస్ట్ సెంట్ర‌ల్ రైల్వే సీపీఆర్‌వో రాజేశ్‌కుమార్ వెల్ల‌డించారు.

ట్రెండింగ్ వార్తలు