Goods Train : ఉత్తరప్రదేశ్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అలహాబాద్ నుంచి ఢిల్లీలోని పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ యూనివర్సిటీ జంక్షన్ను వెళ్తుండగా చందౌలీ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో మొత్తం 8 బోగీలు కిందపడ్డాయి. గూడ్స్ రైలు ప్రమాదానికి గురికావడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటన స్థలికి చేరుకొని పునరుద్ధరణ చేపట్టారు.
చదవండి : Train Coach: రైలు కోచ్లో టీనేజర్ ఆత్మహత్యకు కారణం గ్యాంగ్ రేప్!!
లైన్ క్లియర్ చేయడానికి మరింత సమయం పెట్టె అవకాశం ఉండటంతో రైళ్లను దారి మళ్లించారు అధికారులు. కాగా ఈ ప్రమాదం బుధవారం ఉదయం 6.40ని సమయంలో జరిగినట్లు అధికారులు తెలిపారు.
చదవండి : Trains Restoration : ప్యాసింజర్ రైళ్లు పునరుధ్ధరణ
లోకో ఫైలెట్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి సంబందించిన వివరాలను ఈస్ట్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో రాజేశ్కుమార్ వెల్లడించారు.