Karnataka : లారీని ఢీ కొట్టి దాని వెనుక భాగంలో ఇరుక్కుపోయిన కారు.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లిపోయి.. షాకింగ్ వీడియో

ఓ శాంట్రో కారు ట్రక్కును ఢీ కొట్టింది.. ట్రక్కు వెనుక భాగంలో ఇరుక్కుపోయింది. అది గమనించని ట్రక్కు డ్రైవర్ దానిని 1 కిలోమీటర్ లాక్కెళ్లిపోయాడు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు.

Karnataka

Karnataka Accident : చెత్త లారీని ఓ కారు వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీ కొట్టింది. అంతే ట్రక్కు వెనుక భాగంలో ఇరుక్కుపోయింది. అది గమనించని లారీ డ్రైవర్ అలాగే కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లాడు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Most Expensive Bull : వరదల్లో చిక్కుకున్నఅత్యంత ఖరీదైన ఎద్దును కాపాడిన NDRF బృందం..దాని విలువ ఎంతో తెలుసా..?

కర్ణాటకలోని ఉడిపిలో ఓ శాంట్రో కారు డంపర్ ట్రక్కును ఢీ కొట్టింది. అంతే.. ఇరుక్కుపోయింది. కారును కిలోమీటర్ పైగా ఈడ్చుకెళ్లాడు.  డ్రైవర్ ట్రక్కు వెనుక కారు ఇరుక్కుందన్న విషయం గమనించలేదు. జనం ట్రక్కును వెంబడిస్తుంటే భయంతో మరింత వేగంగా నడిపాడు. ఇక ప్రజలు ట్రక్కును అడ్డుకున్నారు. ప్రమాదానికి గురైన శాంట్రో కారు సాగర్ నుంచి మంగళూరు వెడుతున్నట్లు తెలుస్తోంది.

Himachal Pradesh Tourists Stuck : హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు.. పర్యాటక ప్రాంతాల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థితోపాటు పర్యాటకులు

స్ధానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో గాయపడ్డ ఒక మహిళ, ఇద్దరు పురుషులను ఆసుపత్రికి తరలించారు. ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.