Mumbai
Mumbai : ముంబయి లోకల్ ట్రైన్లో రోజూ ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. తమ ప్రయాణంలో ఒత్తిడిని మర్చిపోవడానికి కొంతమంది పాటలు, డ్యాన్స్లతో సందడి చేస్తుంటారు. తాజాగా ట్రైన్లో కొందరు ప్రయాణికులు లతా మంగేష్కర్ గారు పాడిన సూపర్ హిట్ సాంగ్ ‘కాంత లగా’ పాడుతూ డ్యాన్స్ చేయడం వైరల్గా మారింది.
Mumbai : ముంబయిలో భారీగా క్యూ కట్టిన ప్రజలు .. దేని కోసమో తెలిస్తే ఆశ్చర్యపోతారు
ముంబయి లోకల్ ట్రైన్లో రోజూ అనేకమంది ఎక్కుతూ, దిగుతూ కనిపిస్తారు. ఉద్యోగాలు, కాలేజీలు, వ్యాపార పనుల నిమిత్తం ఎంతోమంది ట్రైన్ ఎక్కుతారు. పిల్లల ఏడుపులు, సీట్లు దొరకక కోట్లాటలు వీటి మధ్య అప్పుడప్పుడు ఒత్తిడి మరిచిపోయే అందమైన పాటలు, డ్యాన్స్లు కూడా ట్రైన్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా 1998_roadrunner అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. లతా మంగేష్కర్ గారు పాడిన హిందీ పాట ‘కాంత లగా’ పాడుతూ, డ్యాన్స్ చేస్తూ పెద్దవాళ్లు, యూత్ సందడి చేయడం ఈ వీడియోలో కనిపించింది. ఈ వీడియో నెటిజన్ల మనసుని దోచుకుంది.
‘పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తున్న వీరంతా నిజంగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు’ అని ఒకరు.. ‘దురదృష్టవశాత్తు లోకల్ రైలును ఆస్వాదించిన చివరి తరం ఇదే కావచ్చు’ అని మరొకరు ట్వీట్ చేశారు. ఇలా ప్రశాంతంగా ప్రయాణిస్తే ఒత్తిడి కూడా దూరమవతుందని చాలామంది అభిప్రాయపడ్డారు.