Viral Video : న్యూ ఇయర్ వేళ అమ్మకోసం.. రాహుల్ గాంధీ చేసిన స్పెషల్ వంట.. ఏంటో తెలుసా?

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.. తల్లీకొడుకులిద్దరూ నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉంటారు..అలాంటిది ఇద్దరు కిచెన్‌లో స్పెషల్ రెసిపీ తయారు చేస్తూ కనపడితే.. న్యూ ఇయర్ వేళ వీరిద్దరూ కలిసి చేసిన ఆ స్పెషల్ రెసిపీ ఏంటో చదవండి.

Viral Video

Viral Video : నిత్యం దేశ రాజకీయాల్లో తలమునకలై ఉండే తల్లీ కొడుకులు కిచెన్‌లో కనిపిస్తే? ఎవరా తల్లీకొడుకులు అంటే.. ఒకరు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ.. ఆమె కొడుకు ఎంపీ రాహుల్ గాంధీ..నూతన సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ వీరిద్దరూ తయారు చేసిన ‘ఆరెంజ్ మార్మలాడ్’ రెసీపీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఆసక్తికరమైన రెసిపీ గురించి.. వారిద్దరు ఇది తయారు చేయడం వెనుక విశేషం గురించి చదవండి.

Rahul Gandhi : డబ్ల్యూఎఫ్ఐ వివాదం వేళ.. బజరంగ్ పునియా, ఇతర రెజ్లర్లను కలిసిన రాహుల్ గాంధీ.. వీడియోలు వైరల్

‘ఆరెంజ్ మార్మలాడ్’ రెసిపీ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ రెసిపీని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ స్వయంగా ప్రిపేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొత్త సంవత్సర ప్రారంభవేళ ఇంట్లో ఫ్రెష్‌గా పండిన నారింజ పండ్లతో ఈ రెసిపీని తయారు చేశారు. నిజానికి ఈ రెసిపీ రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక వాద్రా నుండి నేర్చుకున్నారట. రాహుల్ గాంధీ తన సొంత యూట్యూబ్ ఛానెల్‌లో ఈ రెసిపీ తయారు చేస్తున్న 5 నిముషాల వీడియోను అప్ లోడ్ చేశారు.

వీడియోలో సోనియా, రాహుల్ గార్డెన్‌లోని నారింజ పండ్లు తెంపడానికి బాస్కెట్‌తో వెళ్తూ కనిపిస్తారు. బుట్టలోకి తెచ్చిన పండ్లను కిచెన్‌లో క్లీన్ చేసి ఆరెంజ్ మార్మలాడ్ రెసిపీ తయారు చేయడానికి రెడీ అయ్యారు. కిచెన్‌లో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో సోనియా తనకు భారతీయ వంటకాలు నేర్చుకోవడానికి చాలా సమయం పట్టిందని.. ముఖ్యంగా కారం తినడానికి చాలా సమయం పట్టిందని అన్నారు. తరువాత సంభాషణలో రాహుల్ ‘బీజేపీ వాళ్లు ఈ జామ్ అడిగితే వాళ్లకి ఇద్దామా మమ్మీ?’ అని అడిగారు. అందుకు సోనియా ‘వాళ్లు మన మీద విసురుతారు’ అనగానే ఇద్దరు గట్టిగా నవ్వుకున్నారు.

Sonia Gandhi : పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటన క్షమించరానిది.. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది : సోనియా గాంధీ

రెసిపీ తయారు చేయడం పూర్తి కాగానే దానిని గాజు సీసాల్లోకి నింపారు. ‘ప్రేమతో సోనియా, రాహుల్’ అనే బ్రౌన్ పేపర్ మీద రాసిన మెసేజ్‌ను ఆ సీసాలకు అతికించారు. వీడియో  మొత్తం కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర క్యాంపెయిన్ లోగో కనిపిస్తుంది.  ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తల్లీకొడుకులు ఎంత సింపుల్‌గా ఉన్నారో అంటూ జనాలు కామెంట్లు పెట్టారు. స్వచ్ఛమైన మనసులు అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు.