Kejriwal’s Reaction: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్రంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు ఢీల్లీ సీఎం, అప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. దీనిలో భాగంగా సోమవారం అహ్మదాబాద్లో ఆటోడ్రైవర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒక ఆటో డ్రైవర్ అరవింద్ కేజ్రీవాల్ను తన ఇంటికి డిన్నర్కు ఆహ్వానించాడు.
iOS 16 Update: నేటి నుంచే ఐఓఎస్ 16 వెర్షన్.. ఏయే ఫోన్లు అప్డేట్ చేసుకోవచ్చో తెలుసా!
దీనికి కేజ్రీవాల్ అంగీకరించారు. వచ్చే డిసెంబర్లో గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కేజ్రీవాల్ పట్టుదలతో ఉన్నారు. దీని కోసం రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. సోమవారం ఆటో డ్రైవర్లతో అహ్మదాబాద్లో ఆప్ నేతలతో కలిసి కేజ్రీవాల్ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విక్రమ్ దంతాని అనే ఆటోడ్రైవర్ మాట్లాడాడు. కేజ్రీవాల్ అభిమానిగా చెప్పుకున్న విక్రమ్, ఆయనను తన ఇంటికి డిన్నర్కు రమ్మని పిలిచాడు.
Mobile Torches: కరెంటు లేక మొబైల్ టార్చ్తో రోగులకు చికిత్స.. వైరల్గా మారిన వీడియో
‘‘పంజాబ్లో ఒక డ్రైవర్ ఇంటికి భోజనానికి వెళ్లిన సంగతి నాకు తెలుసు. నేను కూడా మీ అభిమానినే. గుజరాతీని. నా ఇంటికి డిన్నర్కు వస్తారా’’ అని కేజ్రీవాల్ను అడిగాడు. దీనికి కేజ్రీవాల్ బదులిస్తూ.. ఈ రోజే రమ్మంటావా అని అడిగాడు. ‘‘ఒకవేళ నువ్వు నా హోటల్కు వచ్చి తీసుకెళ్తాను అంటే నీ ఆటోలోనే వస్తాను. ఇంకో ఇద్దరిని కూడా తీసుకొస్తాను’’ అని కేజ్రీవాల్ అన్నాడు. ఏ టైమ్కు రమ్మంటావో చెప్పు అని అడిగాడు. దీంతో అక్కడున్న ఆటో డ్రైవర్లంతా సంబరంతో చప్పట్లు కొట్టారు. ఈ సంభాషణకు సంబంధించిన వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.
Delhi CM @ArvindKejriwal accepts a Dinner Invitation from an Autorickshaw Driver of Gujarat ❤️#TownhallWithKejriwal pic.twitter.com/0lf5kS5rkn
— AAP (@AamAadmiParty) September 12, 2022