Narrow Escape: రైలు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు ఓ వ్యక్తి. అయితే, అతడి బైకు మాత్రం ముక్కలు ముక్కలైపోయింది. తాజాగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. రైల్వే క్రాసింగ్ వద్ద కొందరు వాహనదారులు ఆగి ఉన్నారు. పట్టాలపై ఓ రైలు వెళ్తుండడంతో అది వెళ్ళాక వారు వెళ్దామని అనుకున్నారు.
ఆ రైలు వెళ్తున్న పట్టాల పక్కనే ఉన్న మరో పట్టాలపై ఇంకో రైలు వేగంగా దూసుకువచ్చింది. ఈ సమయంలో పట్టాలపైనే బైకులతో ఉన్నారు కొందరు వ్యక్తులు. తాము నిలబడిన పట్టాలపై రైలు వస్తుందని గమనించి తమ బైకులను వెనకకు తీసుకెళ్ళారు. ఈ క్రమంలో ఒకరి బైకు పట్టాలపై పడి ఇరుక్కుపోయింది.
రైలు వేగంగా దూసుకు రావడంతో పట్టాలపైనే బైకును వదిలేసి ఆ వ్యక్తి పక్కకు పరిగెత్తాడు. దీంతో అతడి బైకు రైలు ఢీ కొని ధ్వంసమైంది. రైలు పట్టాలు దాటుతోన్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎంతగా చెబుతున్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రమాదాలు
కొనితెచ్చుకుంటున్నారు.
COVID 19: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 6 వేల కన్నా తక్కువగా నమోదు