Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ స్వల్ప ఘర్షణలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్.. మధ్యాహ్నంకు ఊపందుకుంది. మధ్యాహ్నం 1గంట వరకు 41.30శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.