Home » Photo-gallery » Sonia Priyanka Rahul And Other Leaders Who Voted In Congress President Election
Congress Presidential Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. ఓటు వేసిన సోనియా, ప్రియాంక, రాహుల్, ఇతర నేతలు (ఫొటో గ్యాలరీ)
Congress Presidential Election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం 10గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు జరగనుంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తాత్కాలిక పార్టీ అధ్యక్షురాలు, సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ వాద్రా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అభ్యర్థులు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్, పార్టీ సీనియర్ నేత చిదంబరం, జైరాం రమేష్ సహా పలువురు ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా కర్ణాటకలో ఉన్నారు. ఈ క్రమంలో యాత్రకు సోమవారం విరామం ఇచ్చారు. సంగనకల్లు దగ్గర మీటింగ్ రూంలోనే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడే రాహుల్ తో పాటు మరో 40 మంది కాంగ్రెస్ ప్రతినిధులు ఓటు వేశారు. సాయంత్రం 4గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. ఆయా రాష్ట్రాల్లో పీసీసీ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో కాంగ్రెస్ ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈనెల 19న ఫలితాలు వెల్లడి కానున్నారు.