Home » Photo-gallery » The 100th Day Of Rahul Gandhis Bharat Jodo Yatra Continues In The State Of Rajasthan
Rahul Gandhi Bhart Jodo Yatra: 100 రోజులకు చేరిన భారత్ జోడో యాత్ర.. రాజస్థాన్లో ఉత్సాహంగా ముందుకు..
Rahul Gandhi Bhart Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర 100వ రోజుకు చేరుకుంది. శుక్రవారం 100వ రోజు రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసాలోని మీనా హైకోర్టు నుంచి ఉదయం 6గంటలకు రాహుల్ తన పాదయాత్రను ప్రారంభించారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు, ప్రజలు తరలిరాగా.. రాహుల్ వారితో కలిసి ముందుకు సాగారు. 11గంటల సమయానికి యాత్ర గిరిరాజ్ ధరన్ ఆలయం వద్ద విరామం తీసుకున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఈ ఏడాది సెప్టెంబర్ 7న తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో ప్రారంభమైంది. తమిళనాడు నుంచి కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర సాగుతుంది. జోడో యాత్రలో రాహుల్ స్థానికుల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. 100వ రోజు పాదయాత్రలో భాగంగా పలువురు కాంగ్రెస్ ప్రముఖులు యాత్రలో పాల్గొన్నారు.