CM Revanth Reddy : బిడ్డా గుర్తు పెట్టుకో.. నేను జానారెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని- కేసీఆర్ పై నిప్పులు చెరిగిన సీఎం

చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా. నీ కొడుకు, అల్లుడు, బిడ్డకు .. చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తా.

CM Revanth Reddy Warns Kcr

CM Revanth Reddy : తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు నా వెంట్రుక కూడా అంటూ.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి మాట్లాడే భాష ఇదేనా అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. ”అడవి పందిలా పదేళ్ల పాటు తెలంగాణను సర్వనాశనం చేశారు. పదేళ్లలో వందేళ్ల విధ్వంసం చేశారు. మీ కాలు విరిగిందని, మీ కూతురు జైలుకి పోయిందని కొంతకాలం మేము సంయమనం పాటించా. అలా అని.. ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి నేను జానారెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని అని గుర్తు పెట్టుకో బిడ్డా. మా కార్యకర్తలతో జాగ్రత్త” అంటూ చెలరేగిపోయారు సీఎం రేవంత్ రెడ్డి.

”నీ లత్కోర్ మాటలకు చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా. నువ్వు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టివ్వలేదు. నేను మాత్రం నీకు తప్పకుండా చర్లపల్లి జైల్లో డబుల్ డెబ్ రూమ్ ఇల్లు కట్టిస్తా. బిడ్డా.. నీ కొడుకు, కూతురు, అల్లుడు, నువ్వు.. అందరూ కలిసి ఉండేలా జైల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తా” అని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి.

”నాడు.. బీఆర్ఎస్ ను తొక్కినట్లే.. బీజేపీని కూడా తుక్కు తుక్కుగా తొక్కుదాం. కార్యకర్తల రక్త త్యాగంతో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడింది. గుజరాత్ మోడల్ కాదు.. ఇక వైబ్రెంట్ తెలంగాణ. 700 మంది రైతులను చంపినందుకు మోడీకి ఓటేయాలా..? దేశాన్ని విభజన చేసే కుట్ర చేస్తున్నందుకు మోడీకి ఓటేయాలా..? నమో అంటే.. నమ్మితే మోసం. పదేళ్లైనా విభజన హామీలు అమలు చేయనందుకు బీజేపీకి ఓటేయాలా? మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఇదేనా? దోపిడీ దొంగల్లా పదేళ్లు దోచుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే.. కేసీఆర్ లాగు కూడా ఉండదు.

మా 100 రోజుల పాలన చూసి 14 సీట్లలో గెలిపించండి. రాహుల్ ప్రధాని కావాలంటే.. తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీలను గెలిపించాలి. దేశం మొత్తం పాదయాత్ర చేసి.. ప్రజల బాధలు తెలిసిన రాహుల్.. విమానాల్లో తిరుగుతూ.. పూటకో డ్రస్ మార్చే మోడీ కాదు. నరేంద్ర మోడీ పరివార్.. ఈడీ, సీబీఐ. మాది దేశం కోసం త్యాగం చేసిన గాంధీ పరివార్. ఈ ఎన్నికలు మోడీ పరివార్, గాంధీ పరివార్ మధ్య. తెలంగాణ సమాజానికి గాంధీ కుటుంబం అండగా ఉంటుంది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు దొరక్కుండా నదిలో పడేశారు: రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్