INDIA 3rd Meet: 14 మందితో సమన్వయ కమిటి ఏర్పాటు చేసిన ఇండియా.. ముంబై సమావేశంలో కీలక నిర్ణయాలు

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని ఇండియా కూటమి తీర్మానించింది. వీలైనంత వరకు కలిసి పోటీ చేయాలని నేతల మధ్య అభిప్రాయం కుదిరింది. వివిధ రాష్ట్రాల్లో సీట్ల భాగస్వామ్య ఏర్పాట్లు తక్షణమే ప్రారంభం కానున్నట్లు ఇండియా కూటమి పేర్కొంది.

Mumbai Meet: విపక్షాల ‘ఇండియా’ కూటమి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం 14 మందితో ఈ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం 14 పార్టీల నుంచి ఒక్కొక్కరిని తీసుకుని ఈ సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఇండియా కన్వినర్ ఇంకా నిర్ణయం కాలేదు.

కాగా, ఇందులో..

కేసి వేణుగోపాల్ (కాంగ్రెస్)

శరద్ పవార్(ఎన్సీపీ)
ఎంకే స్టాలిన్(డీఎంకే)
సంజయ్ రౌత్(శివసేన)
తేజస్వి యాదవ్(ఆర్జేడీ)
రాఘవ్ చద్దా(ఆప్), అభిషేక్ బెనర్జీ(టీఎంసీ)
జావేద్ అలీ ఖాన్ (ఎస్పీ)
లలన్ సింగ్ (జేడీయూ)
హేమంత్ సొరేన్(జెఎంఎం)
డి రాజా(సీపీఐ)
ఒమర్ అబ్దుల్లా(నేషనల్ కాన్ఫరెన్స్)
మెహబూబా ముప్తి (పీడీపీ) లగ సమన్వయ కమిటీలో చోటు దక్కించుకున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు
వచ్చే లోక్‌సభ ఎన్నికలు-2024లో కలిసి పోరాడాలని ప్రతిపక్ష కూటమి ప్రతిజ్ఞ చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ సోషల్‌ మీడియా వేదికగా ఎక్స్‌లో తెలిపారు. “భారత కూటమిలో ఉన్న పార్టీలు కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. వీలైనంత వరకు లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం” అని ఆయన పోస్ట్ చేశారు.

సీట్ల పంపకంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు
ఆయన ఇంకా మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాల్లో సీట్ల పంపకాలపై తక్షణమే చర్చలు ప్రారంభించి, వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని, వివిధ ప్రాంతాల్లో జూడేగా భారత్, జీతేగా ఇండియా అంటూ నినాదాలు చేస్తామని చెప్పారు. “ప్రతిపక్ష కూటమి ఎన్నికలను ఇతివృత్తంతో పోటీ చేస్తుంది. ఉమ్మడి మీడియా వ్యూహం రూపొందించబడుతుంది” అని జైరాం రమేశ్ అన్నారు.

ముంబైలో రెండు రోజుల సమావేశం ముగిసింది
రెండు రోజుల పాటు సాగిన మహాకూటమి ఇండియా మూడవ సమావేశం మొత్తానికి ముగిసింది. అంతకుముందు, మొదటి సమావేశం జూన్ నెలలో బీహార్‌లోని పాట్నాలో జరిగింది. ఆ తర్వాత జూలైలో బెంగళూరులో రెండో సమావేశం జరిగింది. ఇందులో కూటమికి ఇండియా అని పేరు పెట్టారు.