వాళ్ల చెంపలు పగలకొట్టండి.. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

భారతీయ జనతా పార్టీ దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ. ఏది ఉన్నా డైరెక్ట్ గా ప్రజలకు చెబుతాం. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే రకమైన ప్రచారం చేశారు.

Kishan Reddy Serious

Kishan Reddy : లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు అంశంపై క్లారిటీ ఇచ్చేశారు కిషన్ రెడ్డి. ఎవడైనా బీఆర్ఎస్, బీజేపీ పొత్తు అని మాట్లాడితే లాగి చెంప చెళ్ళుమని కొట్టండి అని కిషన్ రెడ్డి అన్నారు. ఒక చెంప కాదు ఎడమ కుడి రెండు చెంపలు పగలకొట్టండి అని కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు అనే దుష్ప్రచారాన్ని నమ్మకండి అని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు కిషన్ రెడ్డి. మెడ మీద తలకాయ లేనోడే బీఆర్ఎస్ తో పొత్తు మీద మాట్లాడుతున్నాడు అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ తో బీజేపీ కలుస్తుందా? ఎందుకు కలుస్తుంది? అట్లా అనుకున్నోడు మూర్ఖుడు. మూర్ఖత్వంతో బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు అనేవి పనికిరాని మాటలు. కుట్రపూరితంగా బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారు. బీర్ఎస్ పార్టీ అవసరం తెలంగాణకు లేదు. బీజేపీకి కూడా లేదు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటుకు అవసరం ఉందా? అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే రకమైన ప్రచారం చేశారు. మళ్లీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో కూడా ఇదే రకమైన ప్రచారం చేస్తున్నారు.

మూర్ఖులు, దుర్మార్గులు చేస్తున్న ప్రచారాన్ని బీజేపీ ఖాతర్ చేయదు. భారతీయ జనతా పార్టీ దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ. ఏది ఉన్నా డైరెక్ట్ గా ప్రజలకు చెబుతాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ లా తెరవెనుక నాటకాలు చేయం. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు.. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారాన్ని పంచుకున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పని చేశాయి” అని కిషన్ రెడ్డి అన్నారు.

Also Read : బీఆర్ఎస్ ఎంపీలు మాతో ట‌చ్‌లో ఉన్నారు.. తెలంగాణలో పొత్తులపై లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

 

ట్రెండింగ్ వార్తలు