Minister Roja : పవన్, లోకేశ్ జీవితంలో ఎమ్మెల్యేలు కాలేరు.. మేమూ బ్లూ బుక్ అని రాసుకొని ఉంటే మీరు రాష్ట్రంలో ఉండేవారా? మంత్రి రోజా

మేము ఏ రోజూ లోకేశ్, పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయలేదు అని మంత్రి రోజా అన్నారు.

Minister Roja

Minister Roja : వైసీపీ ఫైర్ బ్రాండ్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా.. ప్రతిపక్ష నేతలపై నిప్పులు చెరిగారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నేత నారా లోకేశ్ జీవితంలో ఎమ్మెల్యేలు కాలేరు అని మంత్రి రోజా అన్నారు. అనంతపురములో మంత్రి రోజా మాట్లాడారు. టీడీపీ-బీజేపీ పొత్తులపై హాట్ కామెంట్స్ చేశారు. జైలుకి వెళ్ళకుండా ఉండటానికే బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని మంత్రి రోజా అన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు పవన్ కల్యాణ్.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని చెప్పారు.

‘చంద్రబాబు అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకుంటారు. రాహుల్ గాంధీని ప్రధాని చేస్తానని కొన్ని రాష్ట్రాల్లో ఫండింగ్ చేశారు. ఢిల్లీలో తెలుగు వారి ఆత్మగౌరాన్ని తాకట్టు పెట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి రాష్ట్రంపైన, రాష్ట్ర ప్రజలపైన ఏమాత్రం ప్రేమాభిమానాలు లేవు. కేవలం పొత్తులతో అధికారంలోకి రావడం, దోచుకోవటం, దాచుకోవటం తప్ప ఏమీ తెలియదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను గాలికి వదిలేసి రాష్ట్రాన్ని ముక్కలు చేసి సర్వనాశనం చేశారు.

పొత్తులతో మోసం చేసే వారిని తరిమి కొట్టండి. లోకేశ్ ఒక ఎర్ర పుష్పం. ఎర్ర పుస్తకం మడిచి బీరువాలో పెట్టుకో. లోకేశ్ ఎమ్మెల్యేగానే గెలవలేదు. ఇక మమ్మల్ని ఏం చేస్తాడు? మేము కూడా బ్లూ బుక్ అని రాసుకొని ఉంటే వీళ్లు రాష్ట్రంలో ఉండేవారా? పవన్, లోకేశ్ జీవితంలో ఎమ్మెల్యేలు కాలేరు. మేము ఏ రోజూ లోకేశ్, పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయలేదు” అని మంత్రి రోజా అన్నారు.

Also Read : శ్రీ కృష్ణుడి పాత్ర మీది.. అర్జునుది పాత్ర నాది: పొత్తులపై జగన్ కామెంట్స్

ట్రెండింగ్ వార్తలు