CM Pawan Kalyan : ఏపీకి కాబోయే సీఎం పవన్ కళ్యాణ్.. మోదీ చెప్పారంట..బీజేపీ చీఫ్ హాట్ కామెంట్స్

పవన్ కళ్యాణ్‌ను ఈ రాష్ట్రానికి అధిపతిని చెయ్యాలి.. అంటే ఏపీకి సీఎంని చేస్తారా..? పవన్‌ని సీఎం చేసే లక్ష్యంతోనే బీజేపీ ఉందా?

CM Pawan Kalyan : తిరుపతి ఉపఎన్నికల వేళ జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి పవన్ ను అధినేత చేయాలన్న ఆలోచన బీజేపీకి ఉందని చెప్పారు. జనసేనాని పవన్ కళ్యాణ్ అంటే ప్రధాని మోదీకి ఎంతో అభిమానం, గౌరవం అన్నారు. పవన్ ను జాగ్రత్తగా గౌరవంగా చూసుకోవాలని స్వయంగా తనతో మోదీ చెప్పారని సోమువీర్రాజు అన్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా పవన్ మీద అదే అభిమానం, గౌరవం ఉన్నాయన్నారు. సోమువీర్రాజు చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ బీజేపీతో పాటు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

తిరుపతి ఉపఎన్నికల నేపథ్యంలో బీజేపీ, జనసేన పార్టీలు సమన్వయ సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. బీజేపీ, జనసేన శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన సోమువీర్రాజు.. పవన్ పై హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రానికి కాబోయే సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. పవన్‌ను సీఎంగా చూడాలని ప్రధాని మోదీ కూడా అభిలషించారని చెప్పుకొచ్చారు.

‘పవన్ కళ్యాణ్‌కు సముచిత గౌరవం ఇవ్వాలని స్వయంగా ప్రధాని మోదీనే నాకు సూచించారు. ప్రధానితో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నప్పుడు.. పవన్‌ను పువ్వుల్లో పెట్టుకుని చూడాలన్నారు’ అని సోము చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో వర్షంలో తడుస్తూ ఇదే తిరుపతిలో నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ప్రసంగించారని సోమువీర్రాజు గుర్తు చేశారు. ప్రధాని మోదీ ఆకాంక్షను బీజేపీ, జనసేన కార్యకర్తలు ట్రూ స్పిరిట్‌తో తీసుకోవాలని, సమన్వయంతో పని చేసి తదుపరి ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేయాలని సోమువీర్రాజు పిలుపునిచ్చారు.

పవన్ కళ్యాణ్‌ను ఈ రాష్ట్రానికి అధిపతిని చెయ్యాలి.. అంటే ఏపీకి సీఎంని చేస్తారా..? పవన్‌ని సీఎం చేసే లక్ష్యంతోనే బీజేపీ ఉందా? ఆ దిశగానే సోమువీర్రాజు సంకేతాలు ఇచ్చారా అని బీజేపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.

ట్రెండింగ్ వార్తలు