పోలీసుల అదుపులో నారా లోకేష్

  • Publish Date - January 10, 2020 / 11:44 AM IST

గుంటూరు జిల్లా కాజ టోల్ ప్లాజా వద్ద  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టీడీపీ ఏపీ అధక్షుడు కళా వెంకటరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  రాజధాని ప్రాంతంలో పర్యటించటానికి అనుమతి లేదని చెపుతూ వారికి  నోటీసులు జారీ చేశారు.  దీంతో లోకేష్ పోలీసులపై ఆగ్రహం వెలిబుచ్చారు. తాను ఏమీ చట్టాన్ని ఉల్లంఘించలేదని ఎవర్నీ రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం లేదన్నారు.

Also Read : యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది
ఒంగోలులో  పర్యటనకు వెళ్లి తిరిగి వస్తుండగా పోలీసులు వీరిని అడ్డుకున్నారు.  ఒకపౌరుడిగా నిరసన తెలిపే హక్కు తనకు ఉంటుందని ఆయన పోలీసులతో అన్నారు. కాగా…. మందడం, వెంకటపాలెంలో మృతి చెందిన రైతుల కుటుంబాలను కళావెంకట్ర్రావు, లోకేష్ పరామర్శించాల్సి ఉంది. ఈక్రమంలోనే వీరిని అడ్డుకున్న పోలీసులు మంగళగిరి  టీడీపీ ఆఫీసుకు తీసుకువెళ్తామని చెప్పి….  రూటుమార్చి తెనాలి మార్గంలో తీసుకువెళుతున్నట్లుతెలుస్తోంది. 

 

ట్రెండింగ్ వార్తలు