ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరు, రాహుల్ ఏ ఎన్నికల్లోనూ గెలవరు- విజయపాయిరెడ్డి

కుటుంబ వ్యవహారంలో తలదూర్చడం కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్ కు ఉదాహరణ. 2029 నాటికి కాంగ్రెస్ ముక్త్ భారత్ గా మారుతుంది.

MP Vijay Sai Reddy

Vijay Sai Reddy : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఏపీకి కోలుకోలేని నష్టం చేసిందన్నారు విజయసాయిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరని చెప్పారు. రాహుల్ గాంధీ ఏ ఎన్నికల్లోనూ గెలవరని జోస్యం చెప్పారు విజయపాయిరెడ్డి. అంతేకాదు 2029 నాటికి కాంగ్రెస్ ముక్త్ భారత్ గా దేశం మారుతుందని చెప్పారాయన. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరిగింది. వైసీపీ తరపున చర్చలో పాల్గొన్నారు విజయసాయిరెడ్డి.

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టారు ఎంపీ విజయసాయిరెడ్డి. ”ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభలో కాంగ్రెస్ కంటి తుడుపు హామీ ఇచ్చింది. ఏపీపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఎందుకు పెట్టలేదు? విభజన చట్టంలో ప్రత్యేక హోదా పొందుపరిచేందుకు ఎందుకు విస్మరించారు? విభజన చట్టంలో ప్రత్యేక హోదా చేర్చడంలో ఫెయిల్ అయ్యారు. చట్టంలో చేర్చడం కాంగ్రెస్ కు చేతగాక, ఇప్పుడు మమ్మల్ని ఎందుకు నిందిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశమే లేదు. ఇప్పుడు దీన్ని ఒక ఎన్నికల అంశంగా మార్చాలని చూస్తున్నారు. ఏపీ ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు.

Also Read : వాళ్లను తిట్టవు నిన్నెలా నమ్మాలని అడిగారు.. జగన్ గురించి సంచలన విషయాలు వెల్లడించిన వసంత కృష్ణప్రసాద్

కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలనకు ఏపీ పెద్ద బాధిత రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో అదృశ్యమైంది. కాంగ్రెస్ ఉన్నంతకాలం దేశం వెనుకబాటుతో కుంగిపోయింది. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో కచ్చితంగా చెప్పారు. ఏపీ ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ గౌరవించడం లేదు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని అనేక సందర్భాల్లో కోరారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్ల కంటే తక్కువ గెలుస్తుందని మమతా బెనర్జీ చెపుతున్నారు. 2004లో తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. పదేళ్ల తర్వాత చిట్టచివరిలో అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించారు. ఎన్నికల నోటిఫికేషన్ కు పది రోజుల ముందు రాష్ట్రాన్ని విభజించారు. ఎన్నికల్లో లాభం పొందాలని ఉద్దేశంతోనే ఇలా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అవకాశవాదంతో వ్యవహరించింది. కాంగ్రెస్ పార్టీ ఏపీకి విలన్. ఏపీ విభజనపై కాంగ్రెస్ పార్టీలోనే ఏకాభిప్రాయం లేదు. ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయినందుకు కాంగ్రెస్ సిగ్గుతో తలదించుకోవాలి. ఏపీకి చేసిన మోసాలకు కాంగ్రెస్ కు తగిన శిక్ష పడాలి. కుటుంబం వ్యవహారంలో తలదూర్చడం కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్ కు ఉదాహరణ.

Also Read : జనసేనకు సీట్ల కేటాయింపుపై బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఏపీకి చేసిన మోసానికి ఈ శిక్ష పడింది. రాహుల్ గాంధీ ఏ ఎన్నికల్లో గెలవరు. 2029 నాటికి కాంగ్రెస్ ముక్త్ భారత్ గా మారుతుంది. కాంగ్రెస్ పాలనాకాలంలో భారతదేశం వెనకడుగు వేసింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశం ఎప్పుడూ ముందుకు వెళ్ళలేదు” అని నిప్పులు చెరిగారు విజయసాయిరెడ్డి.