TTD E Auction Of cameras gifted by devotees on August 1st
TTD : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిత్యం భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. వైకుంఠ వాసుడిని దర్శించుకున్న అనంతరం తమ మొక్కులు చెల్లించుకుంటారు. కోనేటి రాయుడికి కొంత మంది తలనీలాలు సమర్పిస్తే మరికొందరు నగలు, నగదు, బంగారంలతో పాటు విలువైన వస్తులను హుండీల్లో కానుకలుగా సమర్పిస్తుంటారు. ఇలాంటి కానుకల్లో కెమెరాలు సైతం ఉన్నాయి. తాజాగా ఇలా వచ్చిన కెమెరాలను ఈ-వేలం వేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది.
తిరుమలలోని శ్రీవారి ఆలయంలోని హుండీతో పాటు ఇతర తిరుమల అనుబంధ ఆలయాల్లో భక్తులు సమర్పించిన కానుకలను ఆగస్టు 1న ఈ-వేలం వేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకుల్లో కెమెరాలను రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేయనున్నట్లు టీటీడీ పేర్కొంది.
TTD Srivani Tickets : ఆఫ్లైన్లో శ్రీవాణి దర్శనం టికెట్ల కోటా రోజుకు 1000 మాత్రమే
Nikon, Canon, Kodak వంటి కంపెనీలతో పాటు ఇతర కంపెనీలకు చెందిన కెమెరాలు ఉన్నట్లు తెలిపింది. ఉపయోగించిన, పాక్షికంగా దెబ్బతిన్న మొత్తం 10 లాట్ కెమెరాలను ఈ-వేలం కోసం ఉంచుతున్నారు అధికారులు తెలిపారు. ఈ-వేలానికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు టీటీడీ మార్కెటింగ్ ఆఫీసు 0877-2264429 నంబర్ లేదా టీటీడీ వెబ్సైట్ http://tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ http://konugolu.ap.gov.in ను సంప్రదించాలని సూచించింది.
A total of 10 lots of used, partially damaged cameras are being put up for e-auction.
For other details contact TTD Marketing Office, Tirupati at 0877-2264429 during office hours or TTD website https://t.co/2hk52bPNg2 or state government portal https://t.co/mij88oEV3m
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) July 24, 2024