Yadadri : యాదాద్రి శివాలయం పునర్నిర్మాణం

యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి అనుబంధ ధేవాలయం శ్రీ పర్వత వర్ధని సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయ ఉద్ఘాటనకు ఈరోజు అంకురార్ఫణ జరగనుంది.

Yadadri  : యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి అనుబంధ ధేవాలయం శ్రీ పర్వత వర్ధని సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయ ఉద్ఘాటనకు ఈరోజు అంకురార్ఫణ జరగనుంది. నేటి నుంచి ఈనెల 25వరకు శివాలయంలో మహాకుంభాభిషేకం నిర్వహిస్తారు. 25న ఉద్ఘాటన మహోత్సవం జరుగుతుంది.

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి వారి ఆలయ పునర్ నిర్మాణం లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం శివాలయాన్ని పునర్ నిర్మిస్తోంది. ఈ ఉద్ఘాటన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులతో పాటు తోగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి వారుకూడా పాల్గోనున్నారు.

Also Read : Covid cases : ఐదు రాష్ట్రాల్లో పెరిగిన కొవిడ్ కేసులు.. కేంద్రం కీలక ఆదేశాలు..

 

 

ట్రెండింగ్ వార్తలు