Neeraj Chopra : స్వ‌ర్ణం గెలిచిన పాక్ అథ్లెట్ గురించి నీర‌జ్ చోప్రా త‌ల్లి ఏమందో తెలుసా..?

పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఈవెంట్‌లో భార‌త స్టార్ అథ్లెట్ నీర‌జ్ చోప్రా ర‌జ‌త ప‌త‌కాన్ని సొంతం చేసుకున్నాడు.

After Neeraj Chopra Silver What His Mother Said On Pak Star Who Won Gold

Neeraj Chopra mother : పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఈవెంట్‌లో భార‌త స్టార్ అథ్లెట్ నీర‌జ్ చోప్రా ర‌జ‌త ప‌త‌కాన్ని సొంతం చేసుకున్నాడు. పాక్ అథ్లెట్ అర్ష‌ద్ న‌దీమ్‌ గోల్డ్ మెడ‌ల్ గెలిచాడు. కెరీర్‌లో ఒలింపిక్స్‌లో రెండు ప‌త‌కాల‌ను గెలుచుకున్న ఐదో భార‌త అథ్లెట్‌గా నీర‌జ్ చోప్రా నిలిచాడు. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా నీర‌జ్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఇక నీర‌జ్ చోప్రా తండ్రి స‌తీశ్ కుమార్ కొడుకు ప్ర‌ద‌ర్శ‌న పట్ల ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు.

పారిస్ ఒలింపిక్స్‌కు ముందు నీర‌జ్ గాయాల‌తో ఇబ్బందులు ప‌డ్డాడు. దీంతో అత‌డు 2023 కామ‌న్‌వెల్త్ గేమ్స్‌కు దూరం అయిన సంగ‌తి తెలిసిందే. గాయం నుంచి కోలుకుని స‌త్తా చాటి ప‌త‌కాన్ని అందుకున్నాడు నీర‌జ్‌. దీనిపై అత‌డి తండ్రి స‌తీశ్ మాట్లాడుతూ.. నీర‌జ్ ఆట‌తీరును చూసి గ‌ర్వ‌ప‌డుతున్న‌ట్లుగా చెప్పారు. దేశం కోసం రజ‌తం గెలిచాడు. మా ఆనందానికి అవ‌ధులు లేవు. గాయం తీవ్ర‌త కూడా అత‌డి ఆట‌తీరుపై ప్ర‌భావం చూపి ఉంటుంది. లేక‌పోతే మ‌రింత మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేసి ఉండేవాడు. అత‌డు యువ‌త‌కు స్ఫూర్తిగా నిలిచాడు. అని అన్నారు.

Anand Mahindra : ఒలింపిక్స్‌లో నీర‌జ్ చోప్రాకు ర‌జ‌తం.. నేనెంతో బాధ‌ప‌డ్డానంటూ ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్‌

అతడికిష్టమైన ఆహారం వండి పెడతా.. నీరజ్ తల్లి

నీర‌జ్ త‌ల్లీ స‌రోజ్ దేవీ త‌న కొడుకు ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల సంతోషంగా ఉంది. త‌న‌కు కొడుకు ఇష్ట‌మైన ఆహారం వండి పెడ‌తాన‌ని చెప్పింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ర‌జ‌తం గెలిచిన‌ప్ప‌టికి అది మాకు గోల్డ్ కంటే విలువైన‌దే. ఇక్క‌డికి వ‌చ్చాక అత‌డికి ఇష్ట‌మైన ఆహారాన్ని వండిపెడ‌తా. ఇక స్వ‌ర్ణ ప‌త‌కం గెలిచిన అబ్బాయి కూడా త‌న కొడుకు లాంటి వాడే. అని స‌రోజ్ దేవీ అంది.

ట్రెండింగ్ వార్తలు