India vs Bangladesh : సెప్టెంబరు 19 నుండి భారత్తో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన జట్టుకు నజ్ముల్ హొస్సేన్ శాంటో నాయకత్వం వహించనున్నాడు. పాకిస్థాన్లో పాక్పై చారిత్రాత్మక సిరీస్ విజయం సాధించిన జట్టునే దాదాపుగా భారత్తో సిరీస్కు ఎంపిక చేసింది. కేవలం ఒక్క మార్పు మాత్రమే చోటు చేసుకుంది.
పాకిస్థాన్తో జరిగిన తొలి టెస్టులో గాయపడిన లెఫ్టార్మ్ పేసర్ షోరిఫుల్ ఇస్లామ్ భారత్తో సిరీస్కు దూరం అయ్యాడు. గాయం నుంచి అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం. అన్ క్యాప్డ్ ప్లేయర్ జాకర్ అలీ ఎంపిక చేసింది. జాకర్ అలీ బంగ్లాదేశ్ తరుపున 17 టీ20లు ఆడాడు. తొలిసారి టెస్టు జట్టుకు ఎంపిక అయ్యాడు.
Natasa Stankovic : ముంబై వీధుల్లో కారులో బాయ్ఫ్రెండ్తో హార్దిక్ పాండ్యా మాజీ భార్య చక్కర్లు
రెండు టెస్టు మ్యాచుల సిరీస్లో భాగంగా సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా మొదటి టెస్టు మ్యాచ్ జరగనుండగా, రెండో టెస్టు మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి జరగనుంది.
భారత్తో టెస్టు సిరీస్కు బంగ్లా జట్టు ఇదే..
నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), షద్మాన్ ఇస్లాం, జాకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్ , షకీబ్ అల్ హసన్ , లిట్టన్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, నహిద్ రానా, తాయీజుల్ రానా ఇస్లాం, మహ్మదుల్ హసన్ జాయ్, నయీమ్ హసన్, ఖలీద్ అహ్మద్.
IND vs BAN : భారత్ వర్సెస్ బంగ్లాదేశ్.. రెండో టెస్టు వేదిక మార్పు?
Bangladesh Test Squad for the India Tour 2024#BCB #Cricket #BDCricket #Bangladesh #INDvsBAN pic.twitter.com/1npeXGgkix
— Bangladesh Cricket (@BCBtigers) September 12, 2024