Charith Asalanka to lead Sri Lanka in T20I series against India
India vs Sri lanka : ఈ నెలాఖరులో స్వదేశంలో భారత జట్టుతో శ్రీలంక తలపడనుంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య మొదట మూడు మ్యాచుల టీ20 సిరీస్, ఆ తరువాత మూడు మ్యాచుల వన్డే సిరీస్లు జరగనున్నాయి. జూలై 27 నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత్తో టీ20 సిరీస్లో తలపడే శ్రీలంక జట్టును ప్రకటించారు.
ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2024లో లంక జట్టు పేలవ ప్రదర్శన చేయడంతో కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఆల్రౌండర్ వనిందు హసరంగ తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో భారత్తో టీ20 సిరీస్కు కొత్త కెప్టెన్గా చరిత్ అసలంకను లంక బోర్డు నియమించింది. అతడి సారథ్యంలో 16 మందితో కూడిన టీమ్ను ప్రకటించింది.
సీనియర్ ఆటగాళ్లు అయిన ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వకు స్థానం దక్కలేదు. అదే సమయంలో దినేశ్ చండీమల్, కుశాల్ పెరారీలు టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చారు. ఇటీవల ముగిసిన లంక ప్రీమియర్ లీగ్లో మెరుపులు మెరిపించిన అవిష్క ఫెర్నాండో, చమిందు విక్రమసింఘే, బినుర ఫెర్నాండో లకు ఛాన్స్ ఇచ్చింది.
భారత్తో టీ20 సిరీస్కు శ్రీలంక జట్టు ఇదే..
చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, దినేశ్ చండిమల్, కమిందు మెండిస్, దసున్ షనక, వనిందు హసరంగ, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, మతీశ పతిరణ, నువాన్ తుషార, దుష్మంత చమీరా, బినుర ఫెర్నాండో.
Sri Lanka announced a 16-member squad for the India T20I series 📣https://t.co/W410D8dWmc #SLvIND
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 23, 2024