South Africa
South Africa T20 World Cup: మరో నెల రోజుల వ్యవధిలో యూఏఈ వేదికగా వచ్చే జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం సౌతాఫ్రికా జట్టుని గురువారం ప్రకటించింది. తెంబ బవుమా కెప్టెన్సీలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది క్రికెట్ బోర్డు. సీనియర్ ఆటగాళ్లు ఫాఫ్ డుప్లెసిస్, క్రిస్ మోరిస్, ఇమ్రాన్ తాహీర్లకు టీ20 వరల్డ్కప్ జట్టులో చోటు దక్కలేదు.
ఫామ్లో ఉన్నప్పటికీ బోర్డు వారిని పక్కనపెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. డుప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్ ప్రస్తుతం కరీబీయన్ ప్రీమియర్ లీగ్లో ఆడుతున్నారు. సౌతాఫ్రికా అక్టోబర్ 23న తొలి మ్యాచ్లోనే ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.
దక్షిణాఫ్రికా జట్టు: తెంబ బవుమా (కెప్టెన్), డికాక్ (వికెట్ కీపర్), పార్చూన్, హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, మర్క్రమ్, డేవిడ్ మిల్లర్, వియాన్ మల్డర్, లుంగి ఎంగిడి, ఆన్రిచ్ నోర్తేజ్, ప్రొటోరియస్, కగిసో రబాడ, షంషీ, దుస్సేన్.
రిజర్వ్డ్ ప్లేయర్లు: జార్జ్లిండే, ఫెహ్లువాయో, విలియమ్స్
Sai Dharam Tej: యాక్సిడెంట్కు గురైన బైక్ విలువెంతో తెలుసా..
టీమిండియా బృందం: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీని టోర్నీకి ఎంపిక చేసింది.
స్టాండ్ బై ప్లేయర్లు: శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్.