IND vs AFG : దక్షిణాప్రికా పర్యటనను భారత జట్టు విజయంతో ముగించింది. స్వదేశంలో మరో సిరీస్కు సిద్దమైంది. జనవరి 11 నుంచి అఫ్గానిస్తాన్తో మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో పాల్గొనే భారత జట్టును ఆదివారం బీసీసీఐ ప్రకటించింది. దాదాపు 14 నెలల అనంతరం స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20 జట్టులోకి వచ్చారు. హిట్మ్యాన్ రోహిత్ సారథ్యంలోనే టీమ్ఇండియా బరిలోకి దిగనుంది.
2024 జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ ముందు టీమ్ఇండియా ఆడనున్న చివరి టీ20 సిరీస్ ఇదే కావడంతో అందరి దృష్టి దీనిపై పడింది. ఈ సిరీస్కు స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్లకు విశ్రాంతి ఇచ్చారు. టీ20ల్లో నంబర్ వన్ బ్యాటర్ అయిన సూర్యకుమార్ యాదవ్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య, యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్, స్టార్ పేసర్ మహ్మద్ షమీలు గాయాల కారణంగా దూరం అయ్యారు.
Riyan Parag : రియాన్ పరాగ్ మెరుపు శతకం.. వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ రికార్డు సమం
మానసిక సమస్యలతో బాధపడుతూ దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్న ఇషాన్ కిషన్ ఈ సిరీస్ సైతం ఆడడం లేదు.
ఫ్రీగా ఎలా చూడాలంటే..?
మొహాలీ వేదికగా జనవరి 11న భారత్, అఫ్గానిస్తాన్లు మొదటి టీ20 మ్యాచులో తలపడనున్నాయి. ఆ తరువాత జనవరి 14న ఇండోర్లో రెండో టీ20, జనవరి 17న బెంగళూరు వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లు అన్నీ కూడా భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం అవుతాయి.
దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచులు అన్నీ కూడా హాట్స్టార్లో ఫ్రీ ప్రసారం చేసింది. అయితే.. అఫ్గానిస్తాన్ సిరీస్ హాట్స్టార్లో రాదు. ఈ సిరీస్ హక్కులను వయాకామ్ సంస్థకు చెందిన స్పోర్ట్స్ 18 ఛానెల్ దక్కించుకుంది. టీవీల్లో స్పోర్ట్స్ 18 ఛానెల్లో మ్యాచులు ప్రత్యక్షప్రసారం కానుండగా ఓటీటీలో జియో సినిమా యాప్లో చూడొచ్చు. ఈ మ్యాచ్లను ఫ్రీగా చూడొచ్చునని ఇప్పటికే జియో సినిమాస్ వెల్లడించింది.