ICC announced match officials for T20 World Cup 2026 semi finals
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో నాకౌట్ దశకు రంగం సిద్ధమైంది. భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ లు సెమీస్కు చేరుకున్నాయి. బుధవారం (మార్చి 4న) మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. ఇక గురువారం (మార్చి 5న) జరగనున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు ముంబైలోని వాంఖడే మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది.
ఈ రెండు కీలక మ్యాచ్లకు సంబంధించిన అంపైర్లు, మ్యాచ్ అధికారుల ప్యానెల్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది.
PV Sindhu : సురక్షితంగా బెంగళూరు చేరుకున్న పీవీ సింధు.. విశ్రాంతి తీసుకుంటా.. రీ సెట్ అయ్యాక..
కివీస్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్కు రిచర్డ్ ఇల్లింగ్వర్త్, అలెక్స్ వార్ఫ్ లు ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా విధులు నిర్వర్తించనున్నారు. నితిన్ మీనన్ థర్డ్ అంపైర్గా, రాడ్ టక్కర్ ఫోర్త్ అంపైర్గా, జవగల్ శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నారు.
The #T20WorldCup semi-finals match officials have been confirmed.@emirates | Details 👇https://t.co/OpwxAjyGTJ
— ICC (@ICC) March 3, 2026
వాంఖడేలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్లో క్రిస్ గఫానీ, అల్లాహుద్దీన్ పాలేకర్ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా విధులు నిర్వర్తించనున్నారు. ఆడ్రియన్ హోల్డ్స్టాక్ థర్డ్ అంపైర్గా, పాల్ రీఫెల్ ఫోర్త అంపైర్, ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నారు.
Shahid Afridi : ఆఖరి ఓవర్ ఎలా వేయాలో తెలియదా.. అల్లుడి పై షాహిద్ అఫ్రిది ఫైర్.. నువ్వు అసలు..
తొలి సెమీఫైనల్ దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్కు మ్యాచ్ అధికారులు వీరే..
ఆన్-ఫీల్డ్ అంపైర్లు : రిచర్డ్ ఇల్లింగ్వర్త్, అలెక్స్ వార్ఫ్
థర్డ్ అంపైర్ : నితిన్ మీనన్
ఫోర్త్ అంపైర్ : రాడ్ టక్కర్
మ్యాచ్ రిఫరీ : జవగళ్ శ్రీనాథ్
రెండో సెమీఫైనల్ భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ అధికారులు వీరే..
ఆన్-ఫీల్డ్ అంపైర్లు : క్రిస్ గఫానీ, అల్లాహుద్దీన్ పాలేకర్
థర్డ్ అంపైర్ : ఆడ్రియన్ హోల్డ్స్టాక్
ఫోర్త్ అంపైర్ : పాల్ రీఫెల్
మ్యాచ్ రిఫరీ : ఆండీ పైక్రాఫ్ట్