IND vs PAK : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ vs పాక్ మ్యాచ్.. టికెట్ ధ‌ర రూ.57ల‌క్ష‌లు.. ఆస్తులు అమ్ముకోవాల్సిందే..!

సాధార‌ణంగా భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్లు ఎప్పుడెప్పుడు త‌ల‌ప‌డ‌తాయా అని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తుంటారు. అది కూడా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌(ODI World Cup)లో దాయాదుల మ‌ధ్య పోరంటే ఆ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

India Vs Pakistan ODI World Cup Match Tickets Selling For RS 50 Lakh

India Vs Pakistan : సాధార‌ణంగా భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్లు ఎప్పుడెప్పుడు త‌ల‌ప‌డ‌తాయా అని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తుంటారు. అది కూడా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌(ODI World Cup)లో దాయాదుల మ‌ధ్య పోరంటే ఆ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో భాగంగా అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబ‌ర్ 14న భార‌త్‌, పాకిస్తాన్‌లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా మైదానంలో చూసేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఆస‌క్తి చూపిస్తున్నారు.

దీంతో సెకండ‌రీ మార్కెట్‌లో ఈ మ్యాచ్ టికెట్ ధ‌ర‌లు ఆకాశాన్ని అంటాయి. వాస్త‌వానికి బీసీసీఐ అధికారికంగా ఈ మ్యాచ్ టికెట్ల‌ను ఆగ‌స్టు 29, సెప్టెంబ‌ర్ 3 తేదీల్లో అమ్మ‌కాల‌కు ఉంచింది. టికెట్లు విక్ర‌యాలు మొద‌లైన గంట వ్య‌వ‌ధిలోనే సోల్డ్ ఔట్ బోర్డులు ద‌ర్శ‌నం ఇచ్చాయి. అభిమానులు నిరాశ‌కు గురి అయ్యారు. దీంతో సెకండ‌రీ మార్కెట్‌లో టికెట్లకు విప‌రీత‌మైన డిమాండ్ ఏర్ప‌డింది.

Team India: వన్డే ప్రపంచకప్ కు భారత్ జట్టు ప్రకటన.. ఎవరెవరు ఉన్నారంటే?

ఆన్‌లైన్ స్పోర్ట్స్ టికెట్ ఎక్సేంజ్‌, రీసెల్ వెబ్‌సైట్ అయిన వయాగోగో లో సౌత్ ప్రీమియ‌మ్ వెస్ట్ బే టికెట్ రేటు రూ.19.5ల‌క్ష‌లు కాగా, అప్ప‌ర్ టైర్‌లోని రెండు టికెట్లు మాత్ర‌మే మిగిలి ఉన్నాయ‌ని చూపిస్తోంది. ఒక్కొ టికెట్ ధ‌ర రూ.57ల‌క్ష‌ల‌కు పైగా ఉండ‌డం ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం. భార‌త్‌, పాక్ మ్యాచ్ టికెట్లు మాత్ర‌మే కాకుండా టీమ్ఇండియా ఆడ‌నున్న మిగిలిన మ్యాచ్ టికెట్ల‌కు సంబంధించిన టికెట్ల ధ‌ర‌లు సెకండ‌రీ మార్కెట్‌లో భారీగానే ఉన్నాయి. భార‌త్-ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ టికెట్ రేంజ్ రూ.41 వేలు నుంచి రూ.3ల‌క్ష‌ల వ‌ర‌కు, భార‌త్‌-ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య టికెట్ల రేంజ్ రూ.2.3ల‌క్ష‌ల వ‌ర‌కు విక్ర‌యించారు.

India Vs Pakistan ODI World Cup Match Tickets Selling For RS 50 Lakh

మ్యాచ్ టికెట్ల ధ‌ర‌లు మ‌రీ ఎక్కువ‌గా ఉన్న క్ర‌మంలో క్రికెట్ అభిమానులు సోష‌ల్ మీడియాలో త‌మ అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లు ఏం జ‌రుగుతుంది..? ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ టికెట్ల ధ‌ర‌లు రూ.65 వేల నుంచి రూ.4.15వ‌ర‌కు వ‌యాగోగో చూపిస్తోంది. ప‌ట్ట ప‌గ‌లే దోచేస్తున్నారా..? అని ఓ నెటీజ‌న్ కామెంట్ చేయ‌గా భార‌త్‌, పాక్ మ్యాచ్ చూడాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అని ప‌లువురు నెటీజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Virat Kohli : కోహ్లి కోస‌మే వ‌చ్చా.. నా గుండె ప‌గిలిపోయింద‌న్న‌ పాక్ యువ‌తి.. వీడియో వైర‌ల్

ట్రెండింగ్ వార్తలు