ఐపీఎల్ 12వ మ్యాచ్ లో ఇవాళ గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో హైదరాబాద్ జట్టుపై గుజరాత్ టైటాన్స్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ జట్టు 19.1 ఓవర్లలో 168-3 స్కోరు చేసింది.
హైదరాబాద్ జట్టులో అభిషేక్ శర్మ 29, అబ్దుల్ సమద్ 29, క్లాసెన్ 24, షాబాజ్ 22, ట్రావిస్ 19, మయాంక్ 16, మార్క్రమ్ 17 పరుగులు చేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్స్ లో మోహిత్ 3, ఒమర్జాయ్, ఉమేశ్, రషీద్, అహ్మద్ ఒక్కో వికెట్ చొప్పన తీశారు.
గుజరాత్ టైటాన్స్ లో గిల్ 36, వృద్ధిమాన్ 25, సుదర్శన్ 45, డేవిడ్ మిల్లర్ 44 (నాటౌట్), విజయ్ శంకర్ 14 (నాటౌట్) పరుగులు బాదారు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో షాబాజ్, మార్కండే, కమిన్స్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
గుజరాత్ జట్టు: వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్, అబ్దుల్లా, మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేశ్ యాదవ్, నూర్ అహ్మద్, మోహిత్, దర్శన్
హైదరాబాద్ జట్టు: మయాంక్, ట్రావిస్, అభిషేక్ శర్మ, మార్క్రమ్, హెన్రిచ్, అబ్దుల్ సమద్, షహబాజ్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయ్దేవ్
విశాఖలో ఐపీఎల్ సందడి.. ఐదేళ్ల తర్వాత విశాఖ వేదికగా మ్యాచ్! స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు