IND vs SL : శ్రీలంకతో తొలి టెస్టు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. మైలురాయి మ్యాచ్లో ఎవరెవరు ఆడుతున్నారంటే?
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27లో భాగంగా భారత్, శ్రీలంక జట్ల మధ్య (IND vs SL) రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ప్రారంభమైంది.
IND vs SL, Shubman Gill, Dhananjaya de Silva IND vs SL 1st Test match Team India won the toss and elected bat first
IND vs SL : ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27లో భాగంగా భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ప్రారంభమైంది. గాలె వేదికగా నేడు (శనివారం) తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.
‘మేము ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాము. పిచ్, వాతావరణం రెండూ బాగున్నట్లు కనిపిస్తున్నాయి. కాబట్టి మాకు ఇది ఒక మంచి క్రికెట్ రోజు అవుతుందని ఆశిస్తున్నాము. గత మ్యాచ్లో ఆడిన జట్టుతోనే మేము బరిలోకి దిగుతున్నాము. ఐదుగురు బౌలర్లు.. ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాం. దేశానికి నాయకత్వం వహించే అవకాశం లభించడం ఎప్పుడూ గొప్ప గౌరవమే, కానీ ఈ సందర్భం మరింత ప్రత్యేకమైనది. ఇది మా స్వాతంత్వ దినోత్సవం, మా 600వ టెస్ట్ మ్యాచ్ కూడా.. కాబట్టి దీని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము.’ అని టీమ్ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ తెలిపాడు.
‘టాస్ గెలిచి ఉంటే మేము కూడా బ్యాటింగ్ చేసేవాళ్లం. పిచ్ చాలా పొడిగా కూడా ఉంది. పాతుమ్ నిస్సాంక స్థానంలో నిషాన్ మదుష్క జట్టులోకి వచ్చాడు, నిరోషన్ డిక్వెల్లా వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపడతాడు, అలాగే కేశర ఈ రోజు అరంగేట్రం చేయబోతున్నాడు. జట్టులో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లు, నాతో పాటు సోనాల్ దినూషతో కలిపి ఇద్దరు ఆల్-రౌండర్లు ఉన్నారు. గాలేలో ఇది మాకు 50వ టెస్ట్ మ్యాచ్. ఈ టెస్ట్ మ్యాచ్లో భాగం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది.’ అని శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా అన్నాడు.
శ్రీలంక తుది జట్టు..
లహిరు ఉదరా, నిషాన్ మదుష్క, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా(కెప్టెన్), సోనాల్ దినుషా, నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీపర్), కేశర నువంత, ప్రబాత్ జయసూర్య, లహిరు కుమార, అసిత ఫెర్నాండో
Captain Shubman Gill wins the toss and elects to bat first at Galle.
A look at our Playing XI for the game.
Live – https://t.co/bg2q0J2x1f #SLvIND pic.twitter.com/ll2Xa9sTm3
— BCCI (@BCCI) August 15, 2026
భారత తుది జట్టు..
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవ్దత్ పడిక్కల్, శుభ్మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
