IPL 2024 : పంజాబ్ జట్టు గెలుపు సంబరాలు చూశారా.. వీడియో వైరల్

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో

Kolkata vs Punjab : ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు అదరగొట్టింది. కోల్‌‌కతా నిర్దేశించిన 262 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ జట్టు ఛేదించింది. ఫలితంగా కోల్‌కతాపై ఎనిమిది వికెట్ల తేడాతో పంజాబ్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

Also Read : IPL 2024 : సెంచరీతో బెయిర్‌స్టో విజృంభణ.. పంజాబ్ దెబ్బకు కోల్‌కతా ఖేల్ ఖతం.. ఉఫ్‌ అని ఊదేసింది..!

పంజాబ్ ఓపెనర్ ప్రభసిమ్రాన్ సింగ్ (54; 20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జానీ బెయిర్ స్టో (108; 48 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్స్) అద్భుత ఇన్నింగ్స్‌తో సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్)తో హాఫ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. దీంతో కోల్ కతా నిర్దేశించిన 262 పరుగుల టార్గెట్ ను పంజాబ్ జట్టు కేవలం 18.4 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. విజయం అనంతరం పంజాబ్ జట్టు ప్లేయర్లు సంబురాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read : Jasprit Bumrah : ముంబై ఓపెన‌ర్‌గా జ‌స్‌ప్రీత్ బుమ్రా..?

ఈ సీజన్ లో సూపర్ ఫాంలో ఉన్న కోల్ కతా జట్టుపై పంజాబ్ జట్టు గెలవడమే గగనం అనుకున్న క్రీడాభిమానులకు పంజాబ్ జట్టు ఆటగాళ్లు తమ సత్తాను చూపి అద్భుత విజయాన్ని నమోదు చేశారు. ఈ విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి చేరుకుంది. కోల్ కతా రెండో స్థానంలో ఎలాంటి మార్పులేదు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా సెంచరీ చేసిన జానీ బెయిర్ స్టో నిలిచాడు.

 

ట్రెండింగ్ వార్తలు