ముగిసిన ఆటగాళ్ల రిటెన్షన్‌ గడువు.. ఐపీఎల్‌-2025 రిటెన్షన్‌ జాబితా విడుదల.. ధోనీని రిటైన్‌ చేసుకున్న సీఎస్కే

చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులో రుతురాజ్ గైక్వాడ్ (రూ.18 కోట్లు), మతిశ (రూ.13 కోట్లు), శివమ్ దూబె (రూ.12 కోట్లు), రవీంద్ర జడేజా (రూ.18 కోట్లు), ధోనీ (రూ.4 కోట్లు) రిటైన్ అయ్యారు.

ఐపీఎల్‌లో ఆటగాళ్ల రిటెన్షన్‌కు గడువు ముగిసింది. ఐపీఎల్-2025 రిటెన్షన్‌ లిస్టు విడుదలైంది. పలు ఫ్రాంచైజీలు తమకు నచ్చిన ఆటగాళ్లను తమ వద్దే అట్టిపెట్టుకున్నాయి.

నవంబర్‌ రెండు లేదా మూడో వారంలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. కోహ్లీని రిటైన్ చేసుకుంది ఆర్సీబీ. అలాగే, ధోనీని సీఎస్కే, రోహిత్‌ను ముంబై రిటైన్ చేసుకుంది.

ముంబయి ఇండియన్స్‌ జట్టులో జస్‌ప్రీత్ బుమ్రా(రూ.18 కోట్లు), రోహిత్ శర్మ (రూ.16.30 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ.16.35 కోట్లు), హార్దిక్ పాండ్యా (రూ.16.35 కోట్లు), తిలక్ వర్మ (రూ.8 కోట్లు) రిటైన్ అయ్యారు.

చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులో రుతురాజ్ గైక్వాడ్ (రూ.18 కోట్లు), మతిశ (రూ.13 కోట్లు), శివమ్ దూబె (రూ.12 కోట్లు), రవీంద్ర జడేజా (రూ.18 కోట్లు), ధోనీ (రూ.4 కోట్లు) రిటైన్ అయ్యారు.

రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టులో కోహ్లీ (రూ.21 కోట్లు), రజత్ పటిదార్ (రూ.11 కోట్లు), యశ్‌ దయాళ్‌ (రూ.5 కోట్లు) రిటైన్ అయ్యారు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టులో హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు), పాట్ కమిన్స్ (రూ.18 కోట్లు), అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు), నితీశ్‌ రెడ్డి (రూ.6 కోట్లు), ట్రావిస్ హెడ్ (రూ.14 కోట్లు) రిటైన్ అయ్యారు.

రాజస్థాన్ రాయల్స్‌ జట్టులో సంజు శాంసన్ (రూ.18 కోట్లు), యశస్వి జైస్వాల్ (రూ.18 కోట్లు), రియాన్ పరాగ్ (రూ.14 కోట్లు), ధ్రువ్ జురెల్ (రూ.14 కోట్లు), హెట్‌మయర్‌ (రూ.11 కోట్లు), సందీప్ శర్మ (రూ.4 కోట్లు) రిటైన్ అయ్యారు.

ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో అక్షర్ పటేల్ (రూ.16.5 కోట్లు), కుల్దీప్ యాదవ్ (రూ.13.25 కోట్లు), ట్రిస్టన్ స్టబ్స్ (రూ.10 కోట్లు), అభిషేక్ పొరెల్ (రూ.4 కోట్లు) రిటైన్ అయ్యారు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టులో రింకు సింగ్ (రూ.13 కోట్లు), వరుణ్‌ చక్రవర్తి (రూ.12 కోట్లు), సునీల్ నరైన్ (రూ.12 కోట్లు), ఆండ్రీ రస్సెల్ (రూ.12 కోట్లు), హర్షిత్ రాణా (రూ.4 కోట్లు), రమణ్‌దీప్ సింగ్ (రూ.4 కోట్లు) రిటైన్ అయ్యారు.

గుజరాత్‌ టైటాన్స్‌ జట్టులో రషీద్‌ ఖాన్‌ (రూ.18 కోట్లు), శుభ్మన్‌ గిల్‌ (రూ.16.5 కోట్లు), సాయి సుదర్శన్‌ (రూ.8.5 కోట్లు), రాహుల్‌ తెవాతియా (రూ.4 కోట్లు), షారుక్‌ ఖాన్‌ (రూ.4 కోట్లు) రిటైన్ అయ్యారు.

లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టులో నికోలస్‌ పూరన్‌ (రూ.21 కోట్లు), రవి బిష్ణోయ్‌ (రూ.11 కోట్లు), మయాంక్‌ యాదవ్ (రూ.11 కోట్లు), మోసిన్‌ ఖాన్‌ (రూ.4 కోట్లు), ఆయుష్‌ బదోనీ (రూ.4 కోట్లు) రిటైన్ అయ్యారు.

పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో శశాంక్‌ సింగ్‌ (రూ.5.5 కోట్లు), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (రూ.4 కోట్లు) రిటైన్ అయ్యారు.

న్యూజిలాండ్‌ చేతిలో టీమిండియా ఓటమి.. మూడో టెస్టు మ్యాచ్‌పై గంభీర్ కీలక వ్యాఖ్యలు