IPL2022 DC Vs KKR : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా నేడు ఢి కేపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఢిల్లీదే ఆధిపత్యం. మరోసారి కోల్ కతాపై ఢిల్లీ గెలుపొందింది. కోల్ కతా నిర్దేశించిన 147 పరుగుల టార్గెట్ ను ఢిల్లీ జట్టు మరో 6 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో ఢిల్లీ జట్టు 4 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.
147 పరుగుల మోస్తరు టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు.. 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగుల చేసి విక్టరీ కొట్టింది. ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ రాణించాడు. 26 బంతుల్లో 42 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 8 ఫోర్లు ఉన్నాయి. రోవ్ మన్ పావెల్(33*), అక్షర్ పటేల్(24), లలిత్ యాదవ్(22) రాణించారు. కోల్ కతా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రానా, సునిల్ నరైన్ తలో వికెట్ తీశారు. ఈ సీజన్ లో ఢిల్లీ నాలుగో విజయం నమోదు చేసింది.(IPL2022 DC Vs KKR)
Virat Kohli: వివ్ రిచర్డ్స్ను ఇంప్రెస్ చేసిన విరాట్ కోహ్లీ
లక్ష్యం చేధనలో 17 పరుగులకే రెండు వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడిన ఢిల్లీని వార్నర్, లలిత్ ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి 65 పరుగులు జోడించారు. అయితే కోల్కతా బౌలర్లు పుంజుకుని స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లను తీయడంతో రేసులోకి వచ్చింది. అయితే అక్షర్ పటేల్తోపాటు పావెల్ కోల్కతా ఆశలను వమ్ము చేశాడు. ఇంకో 29 పరుగులు జోడించి అక్షర్ రనౌట్గా పెవిలియన్కు చేరాడు. అనంతరం వచ్చిన శార్దూల్ (8*) తో కలిసి పావెల్ మరో వికెట్ పడనీయకుండా ఢిల్లీని విజయతీరాలకు చేర్చాడు.
ఈ మ్యాచ్ లో ఢిల్లీ బౌలర్లు విజృంభించారు. కోల్ కతా బ్యాట్స్ మెన్ ను బెంబేలెత్తించారు. ముఖ్యంగా ఎడమచేతి వాటం రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ధాటికి కోల్ కతా నైట్ రైడర్స్ విలవిల్లాడింది. కుల్దీప్ యాదవ్ కేవలం 14 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులే చేసింది. కుల్దీప్ యాదవ్ తన సంచలన స్పెల్ లో కోల్ కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (42), బాబా ఇంద్రజిత్ (6), సునీల్ నరైన్ (0), ఆండ్రీ రస్సెల్ (0)లను పెవిలియన్ చేర్చి కోల్ కతాను గట్టి దెబ్బకొట్టాడు.
అయితే మిడిలార్డర్ లో నితీశ్ రాణా (57), లోయరార్డర్ లో రింకు సింగ్ (23) రాణించడంతో కోల్ కతా ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మరోవైపు లెఫ్టార్మ్ సీమర్ ముస్తాఫిజూర్ రెహ్మాన్ లైన్ అండ్ లెంత్ కూడిన బంతులు వేయడంతో కోల్ కతా ఆఖరి ఓవర్లలో ధాటిగా ఆడలేకపోయింది. కోల్ కతా జట్టులో నితీశ్ రాణా, శ్రేయాస్ అయ్యర్, రింకు సింగ్ మినహా మిగిలినవాళ్లు దారుణంగా విఫలమయ్యారు.
టీ20 టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. లీగ్ దశలో పది జట్లూ విజయాల కోసం పోరాడుతున్నాయి. ఈ క్రమంలో ముంబైలోని ని వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ, కోల్కతా జట్లు తలపడ్డాయి. టాస్ నెగ్గిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకుని శ్రేయస్ సేనను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. గత సీజన్ వరకు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ ఒకే జట్టు తరఫున ఆడారు. ఇప్పుడు ప్రత్యర్థులుగా మారి తలపడుతున్నారు. ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలంటే తప్పనిసరిగా మ్యాచుల్లో విజయం సాధించాల్సిందే.
Virat Kohli : సమంత సాంగ్కు కోహ్లీ స్టెప్స్.. వీడియో వైరల్
జట్ల వివరాలు:
కోల్కతా నైట్ రైడర్స్ : ఆరోన్ ఫించ్, సునిల్ నరైన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీశ్ రానా, వెంకటేశ్ అయ్యర్, బాబా ఇంద్రజిత్, రింకు సింగ్, ఆండ్రూ రస్సెల్, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రానా.
ఢిల్లీ కేపిట్లస్ : పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్), లలిత్ యాదవ్, రోవ్మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజర్ రహ్మాన్, చేతన్ సకారియా.
A return to winning ways for the Delhi Capitals! ? ?
The Rishabh Pant-led side beat #KKR by 4 wickets & seal their 4⃣th win of the #TATAIPL 2022. ? ?
Scorecard ▶️ https://t.co/jZMJFLuj4h #DCvKKR pic.twitter.com/QCQ4XrJn0P
— IndianPremierLeague (@IPL) April 28, 2022