ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్యాన్స్కి గుడ్న్యూస్. రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం ఓ స్పెషల్ రీఛార్జ్ ప్లాన్ను తీసుకువచ్చింది. ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్లతో 90 రోజుల పాటు జియోహాట్స్టార్ ఉచిత సబ్స్క్రిప్షన్ను అందుకోవచ్చు. దీంతో యూజర్లు మ్యాచ్లను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు. అంతేగాక, ఈ ప్లాన్ ద్వారా అన్లిమిటెడ్ కాలింగ్, హై-స్పీడ్ డేటా, ఇతర ప్రయోజనాలనూ అందుకోవచ్చు.
రూ.299 ప్లాన్
జియో రూ. 299తో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను ప్రారంభించింది. అదనంగా ఎటువంటి సబ్స్క్రిప్షన్ ఛార్జీలు లేకుండా ఐపీఎల్ చూడాలనుకునే వారి కోసం ఈ ప్లాన్ తీసుకొచ్చింది.
ఉచిత జియోహాట్స్టార్ సబ్స్క్రిప్షన్ను అందించే మరిన్ని ప్లాన్లు కూడా ఉన్నాయి. రూ. 299 ప్లాన్తో పాటు, జియో మరో రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లతో 90 రోజుల పాటు ఉచితంగా యాక్సెస్ను అందుకోవచ్చు.
రూ. 349 ప్లాన్
రూ. 899 ప్లాన్
ఐపీఎల్ 2025లో ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా చూడాలనుకునేవారికి జియో అందిస్తున్న ఈ ప్లాన్లను గొప్ప ఆఫర్లుగానే చెప్పుకోవచ్చు. ఏదైనా ప్లాన్లతో రీఛార్జ్ చేసిన తర్వాత యూజర్లు తమ జియో మొబైల్ నంబర్తో జియోహాట్స్టార్ యాప్లోకి లాగిన్ అవ్వడం ద్వారా వారి ఉచిత జియోహాట్స్టార్ సబ్స్క్రిప్షన్ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది యాక్టివేషన్ చేసిన రోజు నుంచి 90 రోజుల వరకు పనిచేస్తుంది.