PIC Credit : KKR
Kolkata Knight Riders : ఐపీఎల్ 17వ సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరిన మొదటి జట్టుగా కోల్కతా నైట్రైడర్స్ నిలిచింది. శనివారం ముంబైతో జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని మరో రెండు మ్యాచులు మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్కు దూసుకువెళ్లింది. గెలుపు జోష్లో ఉన్న కేకేఆర్కు ఐపీఎల్ నిర్వాహకులు గట్టి షాకిచ్చారు. ఆ జట్టు ఆల్రౌండర్ రమణదీప్ సింగ్ మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానాగా విధించారు.
ముంబైతో జరిగిన మ్యాచ్లో అతడు ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు తెలిపారు. ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.2ని ఉల్లంఘించి లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడని, తన తప్పును రమణ్దీప్ అంగీకరించినట్లు చెప్పారు. మ్యాచ్ రిఫరీ విధించిన జరిమానాను అంగీకరించాడన్నారు.
ఆర్టికల్ 2.2 అంటే ఏమిటి..?
క్రికెట్ పరికరాలు లేదంటే స్టంప్స్ను బద్దలు కొట్టడం, మైదానంలోని పరికరాలు లేదంటే ఫిక్చర్లు, ప్రకటనల బోర్డులను డామేజ్ చేయడం వంటి ఆర్టికల్ 2.2 కిందకు వస్తాయి.
మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం కారణంగా మ్యాచ్ను 16 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్లో కోల్కతా తొలుత బ్యాటింగ్ చేసింది. వెంకటేష్ అయ్యర్ (21 బంతుల్లో 42), నితీశ్ రాణా (23 బంతుల్లో 33) లు రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై ఎనిమిది వికెట్ల నష్టానికి 139 పరుగులకే పరిమితమైంది. దీంతో కోల్కతా 18 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక ఈ మ్యాచ్లో రమణ్ దీప్ 8 బంతుల్లో 17 పరుగులు చేశాడు.
Hardhik Pandya : వరుస ఓటములపై హార్దిక్ పాండ్య వ్యాఖ్యలు వైరల్..