Mohammed Shami opens up on his comeback from injury
Mohammed Shami : టీమ్ఇండియా పేసర్ మహమ్మద్ షమీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023 అనంతరం మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న అతడు ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో ఉన్నాడు. ఇటీవలే నెట్స్లో బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. కాగా.. ఇటీవల ఆటగాళ్లకు బీసీసీఐ ఓ షరతు పెట్టిన సంగతి తెలిసిందే. ఏ ఆటగాడు అయినా జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాలీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందని చెప్పింది.
ఈ కండిషన్ పాటించేందుకు షమీ సిద్ధం అయ్యాడు. పశ్చిమ బెంగాల్ తరుపున ఆడేందుకు సిద్ధం అని ప్రకటించాడు. తానెప్పుడు జాతీయ జట్టులోకి వస్తానో చెప్పడం కష్టమని అన్నాడు. జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే.. టీమ్ఇండియా తరుపున ఆడే ముందు బెంగాల్ తరుపున ఆడతానని ప్రకటించాడు. పూర్తి స్థాయిలో సన్నద్ధం అయ్యేందుకు రెండు లేదా మూడు మ్యాచులు ఆడతానని అన్నాడు.
Rohit Sharma : కెప్టెన్గా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. సిక్సర్ల కింగ్..
ఇక వన్డే పప్రపంచకప్ సమయంలో అయిన గాయం తీవ్రత అంచనా వేయలేకపోయినట్లుగా చెప్పాడు. వన్డే ప్రపంచకప్ అనంతరం ఐపీఎల్ ఆడి టీ20 ప్రపంచకప్కు సిద్ధం కావొచ్చునని భావించినట్లుగా చెప్పాడు. అయితే.. గాయం పరిస్థితి శస్త్రచికిత్స వరకు వెళ్లిందన్నాడు. శస్త్రచికిత్స అనంతరం వైద్యులు గాయం నయం కావడానికి చాలా సమయం పడుతుందని వైద్యులు తెలిపినట్లుగా షమీ తెలిపాడు.
ఇదిలా ఉంటే.. టీమ్ఇండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. మూడు మ్యాచుల టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. అదే ఉత్సాహంతో వన్డేల్లో బరిలోకి దిగింది. శుక్రవారం కొలొంబో వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ టైగా ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 47.5 ఓవర్లలో సరిగ్గా 230 పరుగులు చేసి ఆలౌటైంది.