MS Dhoni : ధోనీ వచ్చే సీజన్ ఆడతాడా? మిస్టర్ కూల్ ఏమన్నాడంటే?

MS Dhoni : ఐపీఎల్ 2022 సీజన్ చివరి దశకు చేరుకుంది. ఈ లీగ్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ ఆఖరి లీగ్ మ్యాచ్.. చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఈ సీజన్ సరే.. వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఆడతాడా?

MS Dhoni : ఐపీఎల్ 2022 సీజన్ చివరి దశకు చేరుకుంది. ఈ లీగ్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ ఆఖరి లీగ్ మ్యాచ్.. చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఈ సీజన్ సరే.. వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఆడతాడా? లేదా అనేది ప్రశ్న.. ధోనీ ఐపీఎల్ 2023 టోర్నీలో ఆడేది లేనిది క్లారిటీ ఇచ్చేశాడు.. రాజస్థాన్ తో మ్యాచ్ సమయంలో ధోనీ తన మనసులోని మాటను వెలిబుచ్చాడు.

టాస్ వేసే సందర్భంగా ధోనీ స్పందించాడు. వచ్చే సీజన్ ఆడాలా? లేదా అనేది తాను ఇంకా ఏమనుకోలేదని స్పష్టం చేశాడు ధోనీ. ఐపీఎల్ 2023 సీజన్ కూడా ఆడేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ జట్లలో ఏ జట్టు అంటే ఎక్కువగా ఇష్టమంటే.. తనకు ముంబై జట్టు అంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టమని చెప్పాడు ధోనీ.

Jeep Meridian 7 Seat Suv Launched In India At Rs 29.90 Lakh Price And Features

చెన్నై అభిమానులకు కాదని, అందుకే వచ్చే ఏడాదైనా చెన్నైకి అవకాశం ఇవ్వాలని ఆశిస్తున్నాని తెలిపాడు. తాను వచ్చే ఏడాది సీజన్ ఆడతాడా లేదా ఇప్పుడే అంచనా వేయలేం అన్నాడు. కాకుంటే ఆడేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పుకొచ్చాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు మిస్టర్ కూల్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

అప్పటినుంచి ధోనీ టీ20 లీగ్ కు మాత్రమే పరిమితమయ్యాడు. ఈ సీజన్ సమయానికి ధోనీ తప్పుకుంటాడని అనుకున్నారంతా.. కానీ, పటాపంచలు చేస్తూ తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. చెన్నై ఓడినా ధోనీ మాత్రం తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు.

Read Also : India Vs SA : దక్షిణాఫ్రికాతో భారత్ టీ20 సిరీస్‌.. హర్షల్ పటేల్ దూరం..!

ట్రెండింగ్ వార్తలు