దీంతో అంతర్జాతీయ క్రీడల్లో పాకిస్థాన్ వెనకబడిపోతుందని విమర్శలు ఉన్నాయి. అటువంటిది అన్నింటినీ దాటుకుని ఒలింపిక్స్ వరకు వెళ్లి స్వర్ణ పతకాన్ని సాధించాడు అథ్లెట్ నదీమ్. జావెలిన్ త్రో ఫైనల్లో పాకిస్థాన్ స్టార్ అథ్లెట్ నదీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే.
వ్యక్తిగత క్రీడాంశంలో ఒలింపిక్స్ చరిత్రలో ఆ దేశానికి తొలి స్వర్ణ పతకం ఇదే. గురువారం అర్ధరాత్రి జావెలిన్ త్రో ఫైనల్ను పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ లైవ్లో చూశారు. ఒలింపిక్స్లో దేశానికి తొలి వ్యక్తిగత స్వర్ణ పతకాన్ని సాధించిన సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ వీడియో తీసుకున్నారు.
ఆ సమయంలో షెహబాజ్ షరీఫ్ పక్కన కూర్చున్న వ్యక్తి మాట్లాడుతూ.. ‘శుభాకాంక్షలు సర్.. పాకిస్థాన్ జిందాబాద్.. ఇదంతా మీ విజన్ వల్లే.. అతడికి మీరే అవకాశం ఇచ్చారు’ అని అన్నారు. నదీమ్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటూ, తన వల్లే అతడు స్వర్ణం సాధించాడనేలా ప్రవర్తించిన షరీఫ్పై విమర్శలు వస్తున్నాయి. అసలు షరీఫ్ లైవ్ మ్యాచ్ చూడలేదని, హైలైట్స్ చూస్తూ ఈ వీడియో ఉద్దేశపూర్వకంగానే తీసుకుని పోస్ట్ చేయించారని కొందరు అంటున్నారు. క్రీడాంశాల్లో కూడా అవకాశావాద రాజకీయాలు చేస్తున్నారని కొందరు కామెంట్లు చేశారు.
رانا مشہود شہباز شریف کی تعریفیں باندھتے ہوے کہ سر آپ نے اپنے ویژن کے مطابق ارشد ندیم کو موقع دیا اور اس نے گولڈ میڈل جیتا pic.twitter.com/lOeNSnHeyY
— Salman Durrani (@DurraniViews) August 9, 2024
We should replace Pak Studies books with this video because it epitomises the country better than anything else.
A man fighting on raw talent to achieve the impossible.
Another man in power, who has done nothing, being told: “Sir, ye aapka vision hai.” pic.twitter.com/e5PVr3WS0A
— Ali (@Alii_Rafi) August 9, 2024
Also Read : భారత్-పాక్ స్టార్లు.. మైదానంలో ప్రత్యర్థులు.. బయట దోస్తులు..