PV Sindhu : మలేషియా మాస్టర్స్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు పోరాటం ముగిసింది. ఆమె టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రపంచ నెంబర్ 2, తన చిరకాల ప్రత్యర్థి తైజు యింగ్ చేతిలో మరోసారి పీవీ సింధు ఓటమిపాలైంది. క్వార్టర్ ఫైనల్స్ లో 13-21, 21-12, 12-21 తేడాతో ఓడిపోయింది.
PV Sindhu: పీవీ సింధుకు క్షమాపణలు చెప్పిన మ్యాచ్ రిఫరీ
తొలి సెట్ లో ఓడిపోయిన సింధు, రెండో సెట్ లో పుంజుకుని విజయం సాధించింది. అయితే ఫలితాన్ని నిర్ణయించే మూడో సెట్ ను తైజు కైవసం చేసుకుని, మ్యాచ్ ను గెలుచుకుంది. 55 నిమిషాల పాటు ఈ ఆట సాగింది. తైజు చేతిలో సింధు ఓడిపోవడం ఇది 17వ సారి. చివరిసారిగా 2019లో ప్రపంచ ఛాంపియన్ షిప్ లో తైజును సింధు ఓడించింది. ఆ తర్వాత ఆమెపై సింధు మళ్లీ గెలవలేకపోయింది.
PV Sindhu : పీవీ సింధు ఓటమి… అయినా పతకం