టీమ్ఇండియా రెండో సారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. టీ20 ప్రపంచకప్ 2024 ముగియడంతో హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూరైంది. అయితే.. ద్రవిడ్ వెళ్తూ వెళ్తూ టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి ఓ బాధ్యతలను అప్పగించాడు. ద్రవిడ్ అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడానికి కోహ్లి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాడని అనడంలో ఎటువంటి సందేహం లేదు.
‘తెల్లబంతితో ఆడిన మూడు ట్రోఫీలు మనం సాధించాం. ఇక ఎరుపు మాత్రమే ఉంది. దాన్ని కూడా సాధించండి అని డ్రెస్సింగ్ రూమ్లో కోహ్లితో ద్రవిడ్ చెప్పాడు.’ ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Team India : టీమ్ఇండియా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది.? ఆ ఇద్దరి తర్వాత నడిపించే నాయకుడు ఎవరు.?
పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమ్ఇండియా మూడు ట్రోఫీలు సాధించింది. ఒకటి టీ20 ప్రపంచకప్, రెండోది వన్డే ప్రపంచకప్, ఇక మూడోది ఛాంపియన్స్ ట్రోఫీ అన్నమాట. వైట్ బాల్తో ఆడే ఈ మూడు ఐసీసీ ట్రోఫీలను విరాట్ కోహ్లి అందుకున్నాడు. ఇక మిగిలింది ఎరుపు బంతితో ఆడే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్పే.
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమ్ ఇండియా 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడింది కానీ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. 2023లో రోహిత్ శర్మ సారథ్యంలోనూ భారత్ వరుసగా రెండోసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడింది. అయితే ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ క్రమంలోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ను అందుకుని.. నాలుగు ఐసీసీ ట్రోఫీలను అందుకున్న ఏకైక ఆటగాడిగా కోహ్లి నిలవాలని ద్రవిడ్ కోరాడు.
టెస్టు క్రికెట్లోని గొప్ప ఆటగాళ్లలో ఒకరిగా పరిగణించబడుతున్న కోహ్లి ఈ ఫార్మాట్లో 8,848 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు ఉన్నాయి.