Rohit Sharma
Rohit Sharma Tirumala: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.
Rohit Sharma Family in TTD
రోహిత్ కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు రోహిత్ శర్మను సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Team India captain Rohit Sharma
టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్తో టీ20 సిరీస్ ఆడుతుంది. ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. వెస్టిండీస్తో జరిగిన టెస్ట్, వన్డే సిరీస్లను రోహిత్ సారథ్యంలో టీమిండియా గెలుచుకుంది. ప్రస్తుతం రోహిత్ శర్మ, కోహ్లీ, జడేజా లాంటి ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నారు. మళ్లీ ఆగస్టు 30 నుంచి జరగనున్న ఆసియా కప్తో రోహిత్ మైదానంలో అడుగుపెట్టనున్నారు. ఆసియా కప్కు భారత్ జట్టు ఇంకా జట్టును ప్రకటించలేదు. మరో రెండుమూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.
Rohit Sharma & his family visited Tirupathi Balaji Temple.
The man, The Myth, The Legend.pic.twitter.com/hLiUiXgmUj
— R A T N I S H (@LoyalSachinFan) August 13, 2023