అప్పుడెప్పుడే 2013లో ధోని నాయకత్వంలో భారత జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. మళ్లీ పదకొండేళ్ల తరవాత టీమ్ఇండియా ఖాతాలో మరో ఐసీసీ ట్రోఫీ వచ్చి చేరింది. రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ 2024 టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. శనివారం బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఏడు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచిన భారత్ తో పాటు రన్నరప్గా నిలిచిన దక్షిణాఫ్రికాకు పెద్ద మొత్తంలోనే ప్రైజ్మనీ దక్కింది. సెమీస్లో ఓడిన జట్లు, సూపర్-8, గ్రూప్ స్టేజ్లో నిష్ర్కమించిన జట్లకు ఐసీసీ ప్రైజ్మనీని అందించింది.
ప్రైజ్మనీ వివరాలు ఇలా..
టీ20 ప్రపంచ కప్ ప్రైజ్మనీ మొత్తం రూ.93.80 కోట్లు
– 17 ఏళ్ల తర్వాత మరోసారి టీమ్ఇండియా ట్రోపీని ముద్దాడింది. విజేతగా నిలిచినందుకు ఐసీసీ నుంచి భారత్ 2.45 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.20.50 కోట్లు అందుకుంది. ఇది కాకుండా ఈ టోర్నీలో ఒక్కొ మ్యాచ్ గెలిచినందుకు మ్యాచ్కు 2.96లక్షల చొప్పున అందుకుంది. రెండూ కలిపితే.. దాదాపు రూ.22.76 కోట్లు భారత్ టీ20 ప్రపంచకప్ ద్వారా సంపాదించింది.
– మొదటి సారి ఫైనల్ చేరి రన్నరప్గా నిలిచిన దక్షిణాఫ్రికాకు 1.28 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 10.67 కోట్లు లభించాయి. ఇది కాకుండా 8 మ్యాచ్లు గెలిచినందుకు విడిగా సుమారు 2.07 కోట్ల రూపాయలు. ఈ టోర్నీ ద్వారా దక్షిణాఫ్రికా మొత్తం రూ.12.7 కోట్లు ఆర్జించింది.
– సెమీ ఫైనల్లో ఓడిన అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్లకు రూ 6.56 కోట్లు అందుకున్నాయి.
– ఇక సూపర్ 8 దశ నుంచే ఇంటి బాట పట్టిన అమెరికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, బంగ్లాదేశ్లకు తలా రూ.3.17 కోట్లు అందాయి.
– ఇక గ్రూపు దశ నుంచే నిష్ర్కమించిన జట్లకు ప్రైజ్మనీ లభించింది. 9 నుంచి 12వ ర్యాంక్లో నిలిచిన జట్లకు రూ.2.5కోట్లు అలాగే 13 నుంచి 20వ ర్యాంక్లో నిలిచిన జట్లకు రూ.1.87కోట్లు ప్రైజ్మనీగా అందించింది.
IND vs SA : టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమ్ఇండియా విజయానికి 5 ప్రధాన కారణాలు ఇవే….