Team India : టీమ్ఇండియా టీ20కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి భారత జట్టులో చోటు
టీమ్ఇండియా (Team India) టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఎంపిక అయ్యాడు.
- Thota Vamshi Kumar
- Updated on- June 6, 2026 / 01:33 PM IST
Team India Squad Announced for Ireland and England T20Is and Asian Games
Team India : టీమ్ఇండియా టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఎంపిక అయ్యాడు. అందరూ అనుకున్నట్లుగానే సూర్యకుమార్ యాదవ్ పై వేటు పడింది. ఇక తిలక్ వర్మకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్లతో పాటు ఆసియా గేమ్స్కు టీ20 జట్టను బీసీసీఐ ప్రకటించింది.
Presenting #TeamIndia‘s newest T20I captain 🇮🇳
Congratulations to Shreyas Iyer as he takes the helm in the shortest format of the game 👏@ShreyasIyer15 pic.twitter.com/frfAXAOkTA
— BCCI (@BCCI) June 6, 2026
శనివారం బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో అజిత్ అగార్కర్ అధ్యక్షతన సెలక్షన్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తొలిసారి టీమ్ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. మూడు సిరీస్ల్లోనూ అతడికి చోటు దక్కింది.
Rishabh Pant : రిషబ్ పంత్ అరుదైన ఘనత.. మూడో భారత వికెట్ కీపర్గా..
ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కు భారత జట్టు ఇదే..
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శివమ్ దూబె, నితీశ్కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీ, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్
ఐర్లాండ్తో టీ20 సిరీస్కు భారత జట్టు ఇదే..
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శివమ్ దూబె, నితీశ్కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీ, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్,
ఆసియా గేమ్స్కు భారత జట్టు ఇదే..
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శివమ్ దూబె, నితీశ్కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీ, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్,
ఇంగ్లండ్, ఐర్లాండ్తో జరిగే టీ20 సిరీస్లకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను నియమించింది. జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది.
Presenting #TeamIndia‘s T20I squads for the tours of England & Ireland 2026 🇮🇳#ENGvIND | #IREvIND pic.twitter.com/f84kSSAIDf
— BCCI (@BCCI) June 6, 2026
