IND vs AFG : మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్ గెలిచిన భార‌త్‌.. అఫ్గాన్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో ఘ‌న విజ‌యం

అఫ్గానిస్థాన్‌తో జ‌రుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను (IND vs AFG) భార‌త్ మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సొంతం చేసుకుంది.

Team India won by 7 wickets in 2nd T20 against Afghanistan and series with a match to spare

IND vs AFG : అఫ్గానిస్థాన్‌తో జ‌రుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భార‌త్ మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సొంతం చేసుకుంది. ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భార‌త్ ఏడు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది. అఫ్గాన్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (37; 33 బంతుల్లో 6 ఫోర్లు), ర‌షీద్ ఖాన్ (28; 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), దర్విష్ రసూలీ (26; 15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స‌ర్లు) , మ‌హ్మ‌ద్ న‌బీ (20; 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో నితీశ్ కుమార్ రెడ్డి మూడు వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్ సింగ్ రెండు, జ‌స్‌ప్రీత్ బుమ్రా, అక్ష‌ర్ ప‌టేల్‌, ర‌వి బిష్ణోయ్‌లు త‌లా ఓ వికెట్ సాధించారు.

అనంత‌రం 160 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ 14.5 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో సంజూ శాంస‌న్ (57; 22 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) మెరుపు హాఫ్ సెంచ‌రీ చేశాడు. అభిషేక్ శ‌ర్మ (39; 19 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), ఇషాన్ కిష‌న్ (38 నాటౌట్; 23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) లు వేగంగా ఆడారు. అఫ్గాన్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ మూడు వికెట్లు తీశాడు.